Cyber Crime: మార్కెట్లో కొత్త స్కామ్ - మొదట డబ్బు వస్తుంది, వెంటనే ఖాతా ఖాళీ అవుతుంది!

11 months ago 7
ARTICLE AD
<p><strong>Jumped Deposit Scam:</strong> సైబర్ మోసగాళ్లు రోజురోజుకు కొత్త తరహా మోసాలను కనిపెడుతున్నారు, సెకన్ల వ్యవధిలో ప్రజల డబ్బును దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. సామాన్య ప్రజలను ఎలాగైనా ట్రాప్ చేయడమే వాళ్ల లక్ష్యం. అన్నీ తెలిసి కొందరు, తెలియక మరికొందరు సైబర్&zwnj; క్రైమ్&zwnj; బాధితులుగా మారుతున్నారు. ఇప్పుడు, పోలీసులు కొత్త తరహా మోసం గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దీనిని "జంప్డ్ డిపాజిట్ స్కామ్&zwnj;"గా చెబుతున్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్&zwnj;లో ఇలాంటి మోసాలపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి.&nbsp;</p> <p><strong>జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి?</strong><br />ఈ స్కామ్&zwnj;లో, మోసగాడు, మొదట UPI ద్వారా కొంత డబ్బును (రూ.5,000 వరకు) తాను టార్గెట్&zwnj; చేసిన వ్యక్తి ఫోన్&zwnj; నంబర్&zwnj;కు పంపుతాడు. ఆ వ్యక్తి ఖాతాలోకి డబ్బు క్రెడిట్&zwnj; అయిన వెంటనే, దానికి సంబంధించిన SMS కూడా మొబల్&zwnj; నంబర్&zwnj;కు వస్తుంది. సాధారణంగా ఇలాంటి మెసేజ్&zwnj;లు వచ్చిన వెంటనే ప్రజలు తమ బ్యాంక్&zwnj; ఖాతాలో బ్యాలెన్స్&zwnj; చెక్ చేసుకుంటారు. బ్యాలెన్స్&zwnj; చెక్&zwnj; చేయడానికి UPI పిన్&zwnj; ఎంటర్&zwnj; చేస్తారు. ఇలా చేసిన వెంటనే ఆ ఖాతాలో ఉన్న డబ్బు మాయమైపోతుంది. అంటే, సైబర్&zwnj; నేరగాళ్లు వెంట్రుక వేసి కొండను లాగుతారు, దాదాపుగా సక్సెస్&zwnj; అవుతారు.</p> <p><strong>యూపీఐ పిన్&zwnj; ఎంటర్&zwnj; చేస్తే డబ్బులు ఎలా పోతాయి?</strong><br />సైబర్&zwnj; నేరగాళ్లు, తాము టార్గెట్&zwnj; చేసిన వ్యక్తి ఖాతాకు కొంత డబ్బు పంపడంతో పాటు అతని ఖాతా నుంచి డబ్బు విత్&zwnj;డ్రా రిక్వెస్ట్&zwnj; కూడా పంపుతారు. ఈ విషయం బాధితుడికి తెలీదు. బాధితుడు, తన ఖాతా బ్యాలెన్స్&zwnj;ను చెక్&zwnj; చేయడానికి యూపీఐ పిన్&zwnj; ఎంటర్&zwnj; చేసిన వెంటనే, డబ్బు విత్&zwnj;డ్రా చేయాలన్న మోసగాళ్ల రిక్వెస్ట్&zwnj;కు ఆమోదం లభిస్తుంది. అప్పుడు సైబర్&zwnj; కేటుగాళ్లు ఆ వ్యక్తికి పంపిన డబ్బుకు అనేక రెట్లు మొత్తాన్ని సులభంగా దోచుకుంటారు. తెలీని నంబర్&zwnj; నుంచి డబ్బు క్రెడిట్&zwnj; అయినట్లు వచ్చే SMSల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి నోటిఫికేషన్&zwnj;లు వచ్చిన వెంటనే తమ ఖాతాలో యూపీఐ పిన్&zwnj; ఎంటర్&zwnj; చేయొద్దని హెచ్చరిస్తున్నారు.</p> <p><strong>నేరానికి అడ్డుకట్టే వేసే పరిష్కారాలు</strong><br />అనుమానాస్పద నోటిఫికేషన్&zwnj; లేదా SMS వచ్చినట్లు ప్రజలు గుర్తిస్తే, ప్రజలు కనీసం 15 నిమిషాల వరకు యూపీఐ వాడకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే, డబ్బు విత్&zwnj;డ్రా కోసం సైబర్&zwnj; కేటుగాళ్లు పంపిన రిక్వెస్ట్&zwnj; కాల పరిమితి ముగుస్తుంది. మీరు తక్షణం UPI వాడాల్సి వస్తే, మొదటిసారి తప్పుడు యూపీఐ పిన్&zwnj;ను ఎంటర్&zwnj; చేయాలి. ఇలా చేస్తే, సైబర్&zwnj; కేటుగాళ్ల విత్&zwnj;డ్రా రిక్వెస్ట్&zwnj; రద్దు అవుతుంది. అప్పుడు మీరు సరైన పిన్&zwnj; ఎంటర్&zwnj; చేసి మీ లావాదేవీలు కొనసాగించవచ్చు.&nbsp;</p> <p>నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్&zwnj;లో ఈ స్కామ్&zwnj;పై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఎలాంటి సైబర్&zwnj; క్రైమ్&zwnj; జరిగినా, మోసపోయిన వ్యక్తి, సంఘటన జరిగిన అరగంట లోపే సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్&zwnj;లో, బ్యాంక్&zwnj;లో ఫిర్యాదు చేయాలి. తొలి అరగంటలో ఫిర్యాదు వల్ల, కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టే అవకాశాలు పెరుగుతాయని పోలీసులు వెల్లడించారు.</p> <p><strong>మరో ఆసక్తికర కథనం:</strong> <a title="హ్యుందాయ్&zwnj; నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్&zwnj;ను షేక్&zwnj; చేసిన IPOల లిస్ట్&zwnj;" href="https://telugu.abplive.com/business/personal-finance/from-hyundai-motor-to-swiggy-some-major-ipos-of-2024-creates-buzz-in-stock-market-191559" target="_self">హ్యుందాయ్&zwnj; నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్&zwnj;ను షేక్&zwnj; చేసిన IPOల లిస్ట్&zwnj;</a>&nbsp;</p>
Read Entire Article