Crime News: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు, కాల్వల్లోకి దూసుకెళ్లిన వాహనాలు.. 16 మంది మృతి

10 months ago 8
ARTICLE AD
<p>vehcles Falls Into Gorge: వివాహ వేడుకల్లో పాల్గొన్న వారంతా సంతోషంగా గడిపారు. ఆ తర్వాత స్వగ్రామానికి తిరిగివస్తుండగా వారు ప్రయాణిస్తున్న జీపు బ్రిడ్జిపై నుంచి కాల్వలో పడిపోయింది. మరో బృదం కుంభమేళాలో పుణ్యస్నానాలు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. వారి బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో 16 మంది మృతిచెందగా.. ముగ్గురు గల్లంతయ్యారు. మరికొందరు గాయపడ్డారు.&nbsp;</p> <p><strong>హర్యానాలో తొమ్మిది మంది</strong><br />హర్యానాకు చెందిన 14 మంది పంజాబ్&zwnj;లోని ఫజిల్కాలో జరిగిన తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. అక్కడ తమ బంధుమిత్రులకు కలిసి సంతోషంగా గడిపారు. ఆ తర్వాత శనివారం తిరిగి వస్తుండగా.. రాత్రి వారు ప్రయాణిస్తున్న జీపు హర్యానాలోని ఫతేహాబాద్&zwnj; జిల్లా సర్దారేవాలా ప్రాంతంలో భాఖడా కాలువ వంతెన పైకి చేరుకున్న తర్వాత అదుపుతప్పి జీపు బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారని జిల్లా సబ్&zwnj; కలెక్టర్&zwnj; జగదీశ్&zwnj; చంద్ర చెప్పారు.</p> <p><strong>పొగ మంచు కారణంగానే ప్రమాదం</strong><br />ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. కాల్వలో గాలింపు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల బాలిక ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. మార్గం కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన మిగతా ముగ్గురి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతులందరూ బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.</p> <p><strong>కంభమేళా నుంచి తిరిగివస్తూ</strong><br />ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లిన మధ్యప్రదేశ్​కు చెందిన ఓ బృందం పుణ్య స్నానాలు చేసుకొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గుజరాత్​లోని దంగ్​ జిల్లాలో సపుతారా వ్యాలీ వద్ద ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగింది. డ్రైవర్​ కంట్రోల్​ కోల్పోవడంతో బస్సు 200 ఫీట్ల లోయలో ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 7 భక్తులు మృతిచెందగా, 15 మంది గాయపడినట్లు సమాచారం.</p>
Read Entire Article