Chinni Serial Today October 4th: చిన్ని సీరియల్: వరుణ్‌, లోహితలకు పెళ్లి చేసిన మ్యాడీ, మధు! దేవా ఇంట్లో ఏం జరిగిందంటే!

2 months ago 3
ARTICLE AD
<p><strong>Chinni Serial Today Episode&nbsp;</strong>వరుణ్&zwnj; కేంద్రమంత్రి కూతురితో జరుగుతున్న నిశ్చితార్థం నుంచి తప్పించుకొని గుడిలో లోహితతో పెళ్లికి రెడీ అవుతాడు. లోహిత, వరుణ్&zwnj; ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చొపెడతారు. మధు లోహితతో ఏం టెన్షన్&zwnj; పడకు.. నువ్వు కోరుకున్న లైఫ్ నీకు వస్తుంది. ఎంజాయ్ చేయ్ అని అంటుంది.&nbsp;</p> <p>పంతులు వరుణ్&zwnj;ని, అతిథిని పిలుస్తారు. వసంత వచ్చి చూసే సరికి అతిథి మాత్రమే ఉంటుంది. వరుణ్&zwnj; పక్కనే ఉన్న కిటికీ నుంచి పారిపోయాడని వసంత గుర్తిస్తుంది. చాలా టెన్షన్ అయిపోతుంది. ఆంటీ ఏంటి ఇంత కంగారు పడుతున్నారని అతిథి అనుకుంటుంది. వసంత కంగారుగా అన్నయ్యా అని దేవా వాళ్ల దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. దేవా, నాగవల్లి తల దించుకుంటారు. ఏంటి ఇదంతా అని మినిస్టర్&zwnj; దేవా వాళ్ల మీద కోప్పడతాడు. దేవా, నాగవల్లి ఎంత బతిమాలినా మినిస్టర్ కోప్పడతాడు. మీ అంతు చూస్తా నేను సెంట్రల్ మినిస్టర్&zwnj;ని అని అంటాడు. దేవా రౌడీలను పిలిచి వరుణ్&zwnj; ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి తీసుకురా అని అంటాడు.&nbsp;</p> <p>నాగవల్లి మ్యాడీతో వరుణ్&zwnj; ఎక్కడున్నా వెతికి తీసుకురా అని చెప్తుంది. అలాగే అని మహి బయటకు వెళ్తాడు. అతిథి ఏడుస్తుంటే నాగవల్లి వెళ్లి భయపడకు అతిథి.. నోరారా పిన్ని అని పిలిచావ్.. నీకు అన్యాయం చేయను.. నేను మాటిస్తున్నా వరుణ్&zwnj;కి నీకు నిశ్చితార్థం జరిగేలా చేస్తా అరగంట టైం ఇవ్వు అని అంటుంది. వసంత వరుణ్ ప్రేమ విషయం తెలియడంతో కంగారు పడుతుంటుంది.&nbsp;</p> <p>మ్యాడీ పెళ్లి దగ్గరకు వెళ్తాడు. వరుణ్ మ్యాడీతో ఇంటి దగ్గర పరిస్థితి అడుగుతాడు. అక్కడి పరిస్థితి చెప్తే మీకు హార్ట్&zwnj; అటాక్ వస్తుంది.. అది వద్దులే అని అంటాడు. ఇక లోహిత ఫ్రెండ్ దండలు కొనడం చందు చూస్తాడు. అనుమానం వచ్చి ఫాలో అవుతాడు. వరుణ్, లోహిత పెళ్లి తంతు జరుగుతుంది. జీలకర్రా బెల్లం పెట్టుకుంటారు. వరుణ్ దగ్గర మ్యాడీ ఉంటే లోహిత దగ్గర మధు కూర్చొంటుంది. ఇద్దరి తల మీద అక్షింతలు పడటంతో ఒకర్ని ఒకరు కూర్చొంటారు.&nbsp;</p> <p>మరోవైపు సెంట్రల్ మినిస్టర్ ధనుంజయ్&zwnj;కి సీఎం కాల్ చేసి వస్తున్నా అని చెప్తాడు. ఇప్పుడే వద్దు సార్ నేను చెప్తా మీకు ఎందుకు శ్రమ అని ధనుంజయ్ అంటాడు. తర్వాత దేవాతో ఇంత వరకు తీసుకొచ్చి నలుగురిలో నా పరువు తీయడం కరెక్ట్&zwnj; కాదు దేవా అని అంటారు. మన పరువు ఎక్కడికీ పోకుండా కాపాడుతా సార్ అని దేవా బయటకు వెళ్తాడు. వల్లీని పిలుస్తాడు. బయటకు వెళ్లి ఒకడు ఇలా నిశ్చితార్థం నుంచి బయటకు వెళ్లాడు అంటే కచ్చితంగా దాని వెనక ఓ ఆడది ఉంటుంది. ఎవరినో ప్రేమించి పెళ్లికి రెడీ అయింటాడు. అన్ని గుడులు వెతికించు అని అంటాడు. నాగవల్లి అన్ని ఆలయాలకు వెళ్లమని అంటుంది. సీసీ టీవీ ఫుటేజ్ కూడా తెప్పిస్తుంది.&nbsp;</p> <p>ఓ గుడిలో పెళ్లి అవుతుందని తెలిసి రౌడీలు అందరూ వెళ్తారు. వరుణ్&zwnj; తాళి కట్టే టైంకి రౌడీలు ఆపుతారు. మ్యాడీ వాళ్లని కొట్టి వరుణ్&zwnj;కి తాళి కట్టమని అంటాడు. అందరూ వరుణ్&zwnj;కి త్వరగా తాళి కట్టమని అంటారు. వరుణ్ కంగారుగా తాళి కడతాడు. మ్యాడీ రౌడీలను ఆపుతాడు. వరుణ్&zwnj;, లోహిత మధు, మ్యాడీ వల్ల పెళ్లితో ఒక్కటవుతారు. మరోవైపు లోహిత ఎక్కడా కనిపించలేదని చందు అంటాడు. మన పరువు తీసేసిందని సరళ బాధ పడుతుంది. ఇద్దరూ పంతులుతో లోహిత రావడానికి టైం పడుతుందని పెళ్లి చూపులు ఇప్పుడు వద్దని చెప్తారు. ఏదో ఒకటి చెప్తాలే అని పంతులు వెళ్లిపోతారు. దాని బుద్ధి ఏంటి అమ్మా ఇలా తయారైందని చందు బాధ పడతాడు.&nbsp;</p> <p>వరుణ్, లోహిత జీలకర్రా బెల్లం పెట్టుకొని దండలు మార్చుకొని సందడిగా పెళ్లి చేసుకుంటారు. మధు, మ్యాడీ హ్యాపీగా ఇద్దరికీ పెళ్లి చేస్తారు. లోహిత మధుకి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు లేకపోతే నా పెళ్లి అయ్యేది కాదు అంటుంది. అంత మ్యాడీ వల్లే అని మధు అంటే మ్యాడీకి వరుణ్ థ్యాంక్స్ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.&nbsp;</p>
Read Entire Article