CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి

2 weeks ago 3
ARTICLE AD
<div id=":tf" class="Am aiL Al editable LW-avf tS-tW tS-tY" style="text-align: justify;" tabindex="1" role="textbox" spellcheck="false" aria-label="Message Body" aria-multiline="true" aria-owns=":wg" aria-controls=":wg" aria-expanded="false"> <p>న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. CBSE 9, 10 తరగతుల భాషా కోర్సులో పెద్ద మార్పులు చేసింది. ఈ రెండు తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానం తప్పనిసరి చేసింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. బోర్డు జాతీయ విద్యా విధానం 2020, జాతీయ పాఠ్యక్రమ ఫ్రేమ్&zwnj;వర్క్ 2023 కింద కొత్త భాషా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తుంది.<br /><br />CBSE విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, 9వ తరగతి, 10 తరగతుల విద్యార్థులు ఇప్పుడు R1, R2, R3 రూపంలో మూడు భాషలను చదవాలి. ఈ 3 భాషలలో కనీసం రెండు భారత భాషలు తప్పనిసరి అని సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసింది. ఈ నిబంధన జూలై 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. అయితే పదో తరగతి విద్యార్థులకు మూడో భాషపై బోర్డ్ ఎగ్జామ్ ఉండదని చెప్పి ఊరట కలిగించింది.&nbsp;<br /><br /><strong>విదేశీ భాషను ఎంచుకుంటే కొత్త నిబంధనలు</strong><br /><br />కొత్త విధానం ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషను ఎంచుకోవచ్చు, అయితే మిగిలిన 2 భాషలు భారతీయ భాషలు అయి ఉండాలి. అదనంగా, విదేశీ భాషను నాల్గవ భాషగా కూడా బోధించవచ్చు.<br /><br /><strong>NEP 2020 ప్రకారం మార్పులు</strong><br /><br />NCERT విడుదల చేసిన కొత్త సిలబస్, NEP 2020 సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు స్పష్టం చేసింది. కొత్త విధానం విద్యార్థులలో భాషా నైపుణ్యాలను, భారత భాషలపై అవగాహనను పెంపొందించడానికి సహాయపడుతుందని CBSE భావిస్తోంది.<br /><br /><strong>పాఠశాలలకు కొత్త మార్గదర్శకాలు</strong><br /><br />భాషా విద్యకు సంబంధించిన కొత్త సిలబస్, అభ్యాస లక్ష్యాలు, సామర్థ్యాలను సమీక్షించాలని CBSE అనుబంధ పాఠశాలలకు సూచించింది. భాషా అభ్యాసానికి సంబంధించిన అనేక నైపుణ్యాలు, అంటే చదవడం, వ్యాకరణం, రచన, మౌఖిక కమ్యూనికేషన్ ఇప్పటికే మాధ్యమిక స్థాయి సిలబస్&zwnj;తో సరిపోలుతున్నాయని బోర్డు తెలిపింది.<br /><br /><strong>ప్రస్తుతం 6వ తరగతి పుస్తకాలతో చదువు</strong><br /><br />కొత్త R3 పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చే వరకు 9, 10 తరగతుల విద్యార్థులు ఎంచుకున్న భాషను 6వ తరగతి R3 పుస్తకాలతో చదువుతారు. స్థానిక సాహిత్యం, కవితలు, కథలు, ఇతర విషయాలను కూడా చేర్చాలని స్కూల్స్2కు సూచించారు.</p> <p><strong>టీచర్ల కొరతను అధిగమించడానికి ప్రత్యేక ఏర్పాట్లు</strong><br /><br />కొన్ని పాఠశాలల్లో భారత భాషలకు అర్హులైన ఉపాధ్యాయుల కొరత ఉండవచ్చని CBSE గుర్తించింది. ఈ క్రమంలో పాఠశాలలు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవడానికి బోర్డు అనుమతించింది. దీని కింద స్కూల్స్ పరస్పర సహకారం, ఆన్&zwnj;లైన్ టీచింగ్, రిటైర్డ్ టీచర్ల సేవలు, అర్హులైన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులను నియమించుకోవచ్చు.<br /><br /><strong>19 భాషల్లో బోర్డు పుస్తకాలు&nbsp;</strong><br /><br />19 షెడ్యూల్ చేసిన భారతీయ భాషలలో R3 పాఠ్యపుస్తకాలను జూలై 1, 2026 నాటికి పాఠశాలలకు అందజేస్తామని బోర్డు తెలిపింది. అదనపు బోధనా సామగ్రిని ఉపయోగించడంపై మార్గదర్శకాలు జూన్ 15, 2026 నాటికి విడుదల చేయనున్నారు.&nbsp;</p> <div id=":tf" class="Am aiL Al editable LW-avf tS-tW tS-tY" tabindex="1" role="textbox" spellcheck="false" aria-label="Message Body" aria-multiline="true" aria-owns=":wg" aria-controls=":wg" aria-expanded="false"> <p>&nbsp;</p> </div> </div>
Read Entire Article