Bomb threats to RBI: ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు

11 months ago 8
ARTICLE AD
<p>Bomb threats to RBI Office : దేశంలో త&zwnj;ర&zwnj;చుగా బాంబు బెదిరింపులు వ&zwnj;స్తూనే ఉన్నాయి. రైళ్ల&zwnj;లో బాంబులు పెట్టామ&zwnj;ని.. షాపింగ్ మాల్స్&zwnj;లో బాంబులు పెట్టార&zwnj;ని.. ఇలా ఏదో ఒకటి రోజూ వెలుగు చూస్తూనే ఉంది. ఇక&zwnj;, విమానాల్లో బాంబులు పెట్టార&zwnj;న్న స&zwnj;మాచారాలు గ&zwnj;త రెండు వారాల్లో క&zwnj;ల&zwnj;క&zwnj;లం రేపాయి. తీరా చూస్తే.. అవ&zwnj;న్నీ న&zwnj;కిలీవేన&zwnj;ని తేలింది. ఇక&zwnj;, ఇప్పుడు తాజాగా ప్ర&zwnj;ఖ్యాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సైతం బాంబు బెదిరింపు రావ&zwnj;డం అంద&zwnj;రినీ టెన్ష&zwnj;న్&zwnj;కు గురి చేసింది. గురువారం మ&zwnj;ధ్యాహ్నం RBI అధికారిక వెబ్&zwnj;సైట్&zwnj;లోనే ఈ బెదిరింపు మెయిల్ రావ&zwnj;డంతో అంద&zwnj;రూ టెన్ష&zwnj;న్&zwnj;కు గుర&zwnj;య్యారు. &nbsp;</p> <p>గురువారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ కనిపించింది. ఈ ఇమెయిల్ రష్యన్ భాషలో ఉంది. రిజర్వ్ బ్యాంక్&zwnj;ను పేల్చివేయనున్న&zwnj;ట్టు ఆగంతులు దానిలో పేర్కొన్నారు. దీంతో హుటాహుటిన స్పందించిన అధికారులు మాతా రమాబాయి మార్గ్ (MRA మార్గ్) పోలీస్ స్టేషన్&zwnj;లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. పోలీసులు సైతం రంగంలోకి దిగి.. బ్యాంకును ప&zwnj;రిశీలించారు. కాగా.. గత నెలలో కూడా RBI కస్టమర్ కేర్ నంబర్&zwnj;కు ఇలానే ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అప్ప&zwnj;ట్లో ఫోన్ చేసిన వ్య&zwnj;క్తి తనను తాను ఉగ్ర&zwnj;వాద సంస్థ&zwnj; లష్కరే తోయిబా సీఈవోగా చెప్పుకొన్నాడు. బ్యాంక్&zwnj;ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు. కానీ, అప్ప&zwnj;ట్లో ఎలాంటి ఘ&zwnj;ట&zwnj;న&zwnj;లు చోటు చేసుకోలేదు.&nbsp;</p> <p><strong>ఢిల్లీ స్కూళ్ల&zwnj;కు కూడా.. &nbsp;</strong></p> <p>ఢిల్లీలోని ప&zwnj;లు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు మొద&zwnj;ల&zwnj;య్యాయి. రెండు నెల&zwnj;ల కింద&zwnj;ట ఇలానే బెదిరింపులు రావ&zwnj;డంతో విద్యార్థులు, వారి త&zwnj;ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ&zwnj;న&zwnj;కు గుర&zwnj;య్యాయి. వాటి నుంచి తేరుకోక&zwnj;మేందు. తాజాగా మ&zwnj;రోసారి శుక్ర&zwnj;వారం(13, డిసెంబ&zwnj;రు) ఉద&zwnj;యం కూడా బెదిరింపు మెయిళ్లు వ&zwnj;చ్చాయి. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ద&zwnj;ర్యాప్తు చేశారు. అయితే.. ఈ దర్యాప్తులో అనుమానాస్పద వ&zwnj;స్తువులు కానీ, బాంబులు కానీ గుర్తించలేదు.&nbsp;</p> <p><strong>4 స్కూళ్లకు బెదిరింపులు..</strong></p> <p>ఢిల్లీలో పేరొందిన ఈస్ట్ ఆఫ్ కైలాష్ DPS, సల్వాన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్, మోడ్రన్ స్కూళ్ల&zwnj;కు తాజాగా బాంబు బెదిరింపు ఈ మెయిళ్లు వచ్చాయి. ఈ రోజు(శుక్ర&zwnj;వారం) ఉద&zwnj;యం య&zwnj;థావిధిగా ఆయా పాఠ&zwnj;శాల&zwnj;లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఇంత&zwnj;లోనే పాఠ&zwnj;శాల&zwnj;ల&zwnj;కు బెదిరింపు ఈమెయిళ్లు వ&zwnj;చ్చాయి. దీంతో యాజ&zwnj;మాన్యాలు హుటాహుటిన ఈ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖకు చేర&zwnj;వేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేప&zwnj;ట్టారు. ఆయా స్కూళ్ల&zwnj;లో అణువ&zwnj;ణువూ గాలించారు. అయితే.. ఎక్క&zwnj;డా అనుమానాస్ప&zwnj;ద వ&zwnj;స్తువులు ల&zwnj;భించ&zwnj;లేద&zwnj;ని పోలీసులు తెలిపారు. &nbsp;</p> <p><strong>కామ&zwnj;న్ అయిపోయాయా?&nbsp;</strong></p> <p>ఇటీవ&zwnj;ల కాలంలో ఢిల్లీలో ప్రతిరోజూ ఎవరో ఒక&zwnj; గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ లేదా కాల్ ద్వారా బాంబుల&zwnj;తో దాడి చేస్తాం అంటూ.. యాజమాన్యాన్ని బెదిరించ&zwnj;డం కామ&zwnj;న్ అయిపోయింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి త&zwnj;ల్లిదండ్రులు కూడా భయాందోళనతోనే పాఠ&zwnj;శాల&zwnj;కు పిల్ల&zwnj;లను పంపుతున్నారు. గత సోమవారం (డిసెంబర్ 9) కూడా ఢిల్లీలోని దాదాపు 40 పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్సు, ఈమెయిళ్లు వ&zwnj;చ్చాయి. సోమవారం ఉదయం అప్పటికే పిల్లలు క్లాస్&zwnj;కి హాజరయ్యేందుకు వచ్చారు. ఇంత&zwnj;లోనే ఈమెయిళ్లు రావ&zwnj;డంతో ఒక్క&zwnj;సారిగా అల&zwnj;జ&zwnj;డి రేగింది. పాఠశాల నిర్వాహకులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లలందరినీ తిరిగి ఇంటికి పంపించారు. అప్ప&zwnj;ట్లోనే విచార&zwnj;ణ చేసిన పోలీసులు.. ప్రతి పాఠశాలలోనిఅన్ని మూలలను క్షుణ్నంగా తనిఖీ చేసారు. కానీ, ఏమీ ల&zwnj;భించ&zwnj;లేదు.</p> <p><strong>డబ్బుల కోసం!</strong><br />&nbsp;<br />డిసెంబర్ 9 సోమవారం బెదిరింపు ఈ-మెయిల్ పంపిన వ్యక్తి ఏకంగా 3 వేల అమెరికన్ డాలర్లు డిమాండ్ చేశాడు. బాంబులు చాలా చిన్నవని, విచారణలో అవి దొరకవని కూడా చెప్ప&zwnj;డం గ&zwnj;మ&zwnj;నార్హం. సొమ్ము ఇవ్వ&zwnj;క&zwnj;పోతే &nbsp;బాంబు పేలుస్తానని హెచ్చ&zwnj;రించాడు. దీంతో మ&zwnj;రింత టెన్ష&zwnj;న్ ఏర్ప&zwnj;డింది. చివ&zwnj;ర&zwnj;కు ఏమీ ల&zwnj;భించ&zwnj;క&zwnj;పోవ&zwnj;డంతో అంద&zwnj;రూ ఊపిరి పీల్చుకున్నారు.&nbsp;</p> <p><strong>రెండు సార్లు పేలుళ్లు&nbsp;</strong></p> <p>అయితే.. ఇలా వచ్చే కాల్స్&zwnj;, ఈమెయిళ్ల&zwnj;ను లైట్ తీసుకున్నా క&zwnj;ష్ట&zwnj;మే. ఎందుకంటే.. గ&zwnj;తంలో ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో రెండు పేలుళ్లు జరిగాయి. అయితే.. తీవ్ర&zwnj;త త&zwnj;క్కువ కావ&zwnj;డంతో ఎలాంటి ప్ర&zwnj;మాదం సంభ&zwnj;వించ&zwnj;లేదు. &nbsp;నవంబర్ చివరలో ప్రశాంత్ విహార్&zwnj;లో సంభ&zwnj;వించిన రెండు పేలుడు ఘ&zwnj;ట&zwnj;న&zwnj;ల్లోనూ &nbsp;`తెల్లటి పొడి` కనిపించింది. అయితే, అది ప్ర&zwnj;మాద&zwnj;క&zwnj;రం కాద&zwnj;ని పోలీసులు తెలిపారు. కాగా.. ప్రజల్లో భయాందోళనలు, గందరగోళం సృష్టించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని వారు భావిస్తున్నారు. అయితే ఈ పేలుళ్లు, బెదిరింపుల వెనుక ఉన్న ఉద్దేశం తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది.&nbsp;</p>
Read Entire Article