BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి

3 months ago 8
ARTICLE AD
<p style="text-align: justify;">బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు (BMC Election 2026) ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. బీజేపీ మొత్తం మహారాష్ట్రతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా అధికారం చేపట్టబోతోందని స్పష్టమైంది. ముంబై మేయర్ పదవిని బీజేపీయే చేపట్టనుంది. మరోవైపు, ఉద్ధవ్ థాకరే ముంబైపై ఏళ్లుగా కొనసాగుతున్న ఆధిపత్యానికి తెరపడనుంది.&nbsp;</p> <p style="text-align: justify;">వార్త రాసే సమయానికి, BMCలోని 227 సీట్లలో 210 సీట్ల ట్రెండ్స్ బటయకు వచ్చాయి. వీటిలో బీజేపీ 90 సీట్లలో ఆధిక్యంలో ఉంది. <a title="ఏక్&zwnj;నాథ్ షిండే" href="https://www.abplive.com/topic/eknath-shinde" data-type="interlinkingkeywords">ఏక్&zwnj;నాథ్ షిండే</a> శివసేన 28 సీట్లలో, ఉద్ధవ్ థాకరే శివసేన UBT 57 సీట్లలో, రాజ్ థాకరే MNS 9 సీట్లలో, <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> 15 సీట్లలో, అజిత్ పవార్ NCP 3 సీట్లలో, ఇతరులు 6 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, శరద్ పవార్ NCP-SP ఖాతా కూడా తెరవలేదు.</p> <p><strong>ట్రెండ్స్&zwnj;లో బీజేపీ మెజారిటీ మార్కు</strong></p> <p>బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)తో సహా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు వచ్చిన ట్రెండ్స్&zwnj;లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఆధిక్యం సాధించింది. BMC ఎన్నికల్లో మహా యుతి మెజారిటీ మార్కును దాటింది. అయితే, ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్&zwnj;లో ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే పార్టీలు నిరాశాజనక ప్రదర్శన చేశాయి.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>మేయర్ పేరుపై ఇంకా చర్చించలేదు&nbsp;</strong></p> <p style="text-align: justify;">ముంబైలో బీజేపీ మేయర్ ఉంటారని ఫలితాలు చూస్తే చెప్పవచ్చు. కానీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే మేయర్ రేసులో ఎవరు ఉంటారనే&nbsp; దానిపై మెజార్టీ సాధించిన కూటమి చర్చించవచ్చు.</p> <p style="text-align: justify;"><strong>ముంబైలో 52.94 శాతం ఓటింగ్ నమోదు</strong></p> <p style="text-align: justify;">బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో మొత్తం 52.94 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2017లో జరిగిన 55.53 శాతం ఓటింగ్&zwnj;తో పోలిస్తే రెండున్నర శాతం తక్కువ. పోలింగ్ ముగిసిన 15 గంటల తర్వాత BMC ఫైనల్ ఓటింగ్ శాతాన్ని ప్రకటించింది. ముంబైలో 25 నిర్ణీత కౌంటింగ్ కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో స్థానంలో ఫలితాలు వెలువడుతున్నాయి. <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది.&nbsp;</p>
Read Entire Article