BJP Vishnu: త్వరలో నక్సల్ రహిత భారత్ - “భారత్ మంథన్”లో బీజేపీ అగ్రనేతల నమ్మకం

2 months ago 3
ARTICLE AD
<p>Naxalism will end in India: నక్సలిజాన్ని వచ్చే ఏడాది మార్చి 31లోపు నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. &ldquo;నక్సల్&zwnj;-రహిత భారతదేశం&rdquo; అనే అంశంపై &nbsp;ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్&zwnj;లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన &ldquo;భారత్ మంథన్&rdquo; కార్యక్రమం &nbsp;జరిగింది. ఇందులో హోంమంత్రి అమిత్ షాతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. &nbsp;మావోయిస్టు హింస ప్రభావిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించడానికి &nbsp;అవసరమైనవ్యూహాలపై వివరణాత్మక అభిప్రాయాలను పంచుకున్నారు. మావోయిస్టు ఉగ్రవాదంపై విజయం కేవలం భద్రతా దళాల ఫలితం మాత్రమే కాదు, సమాజం సమిష్టి అవగాహన, అభివృద్ధి , ప్రజాస్వామ్య సాధికారత ఫలితమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. &nbsp;పారామిలిటరీ దళాలు , పోలీసుల &nbsp; భాగస్వామ్యం, కఠినమైన చర్యల కారణంగా, నక్సలిజం నే ఉనికి &nbsp; చివరి దశలో ఉందన్నారు.&nbsp; &nbsp;&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="te">ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్&zwnj;లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన &ldquo;భారత్ మంథన్&rdquo; కార్యక్రమంలో నేను పాల్గొని, &ldquo;నక్సల్&zwnj;-రహిత భారతదేశం&rdquo; అనే అంశంపై నా ఆలోచనలను పంచుకున్నాను.<br /><br />కేంద్ర గృహ మంత్రివర్యులు అమిత్ షా గారు ప్రత్యేక అతిథిగా హాజరై, వామపక్ష&hellip; <a href="https://t.co/SFMXs69sR5">pic.twitter.com/SFMXs69sR5</a></p> &mdash; Vishnu Vardhan Reddy (@SVishnuReddy) <a href="https://twitter.com/SVishnuReddy/status/1972305950724817356?ref_src=twsrc%5Etfw">September 28, 2025</a></blockquote> <p>భారత్ మంథన్&zwnj;లో ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మావోయిస్టులతో ఎలాంటి శాంతి ఒప్పందం ఉండబోదని, ఆయుధాలు వదులుకుని లొంగిపోతే వారికి పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. &nbsp;అమిత్ షా, ఇటీవల చత్తీస్&zwnj;గఢ్&zwnj;లో విడుదలైన ఒక లేఖను ఉద్దేశిస్తూ, మావోయిస్టులు లొంగిపోతామని చెప్పడం గందరగోళం సృష్టించే ప్రయత్నమని విమర్శించారు. "శాంతి ఒప్పందం ఉండదు. ఆయుధాలు వదులుకోండి, లొంగిపోండి, పునరావాసం కల్పిస్తాం" అని ఆయన స్పష్టం చేశారు. ఈ &nbsp;</p> <p>అభివృద్ధి లేకపోవడమే నక్సలిజం పెరగడానికి కారణమనే వాదనను "తప్పుదారి పట్టించే" ప్రచారంగా షా తోసిపుచ్చారు. "స్వాతంత్ర్యం వచ్చినప్పుడు వనరులు పరిమితంగా ఉన్నాయి, అన్ని ప్రాంతాలు ఒకేసారి అభివృద్ధి చెందలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చత్తీస్&zwnj;గఢ్&zwnj;లోని బీజాపూర్, సుక్మా వంటి ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకున్నది ఎవరు?" అని ఆయన ఎడతెగని మావోయిస్ట్ మద్దతుదారులను ప్రశ్నించారు. ఆయన కొలంబియా, పెరూ, కంబోడియా ఉదాహరణలను ప్రస్తావిస్తూ, &nbsp;వామపక్ష భావజాలం మరియు హింస ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు.&nbsp;</p> <p>2014లో <a title="నరేంద్ర మోదీ" href="https://telugu.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a> ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, నక్సలిజంపై "ఏకీకృత , కఠిన" విధానాన్ని అనుసరించినట్టు షా తెలిపారు. గత ప్రభుత్వాల "విచ్ఛిన్న" విధానాలకు భిన్నంగా, ఈ వ్యూహం హింసకు వ్యతిరేకంగా కఠిన చర్యలు, లొంగిపోయినవారికి పునరావాసం, మరియు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిని కలిపి చేసింది. "మేం రక్తపాతం కోరుకోం. కానీ అమాయక ఆదివాసీలను చంపాలనుకుంటే, వారిని రక్షించడం మా ధర్మం" అని ఆయన అన్నారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/lifestyle/here-is-a-10-day-bangkok-tour-plan-and-budget-calculations-221662" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article