Bihar Election Result 2025: బిహార్ ఎన్నికల ఫలితాలు సరిగ్గా అంచనా వేసిన ఏబీపీ న్యూస్, మరికొన్ని సంస్థలు

3 weeks ago 2
ARTICLE AD
<p style="text-align: justify;">బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫలితాలు మరికాసేట్లో తేలనున్నాయి. ఎన్డీఏ 160 స్థానాల్లో ముందంజలో ఉండగా, మహాకూటమి 68 స్థానాల్లో కొనసాగుతోంది. ఇతర అభ్యర్థుల ఖాతాలో 13 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.&nbsp;ఈసారి బిహార్&zwnj;లో అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. ఎన్నికలకు ముందు వివిధ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఉదయం 10 గంటల వరకు వచ్చిన ఎర్లీ ట్రెండ్స్ గమనిస్తే చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా అత్యంత ఖచ్చితమైనవిగా చెప్పవచ్చు. సాధారణంగా బిహార్ ఎగ్జిట్ పోల్స్.. యాక్చువల్ రిజల్ట్స్ భిన్నంగా ఉండేవి. కానీ ఈసారి చాలా వరకు సర్వే సంస్థల అంచనాలు నిజమవుతున్నాయి.</p> <p style="text-align: justify;"><strong>ఎగ్జిట్ పోల్స్&zwnj;పై మూడు అత్యంత ఖచ్చితమైన అంచనాలు</strong></p> <p style="text-align: justify;"><strong>1.</strong> పోల్&zwnj;స్ట్రేట్ ప్రకారం ఎన్డీఏ 133-148 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో బీజేపీ 68- 72 సీట్లు, జేడీయూ 55-60 సీట్లు, ఎల్&zwnj;జేపీ-ఆర్ 9-12, హమ్ 1-2 సీట్లు.. ఆర్&zwnj;ఎల్&zwnj;ఎం 0-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.</p> <p style="text-align: justify;"><strong>2.</strong> పీపుల్స్ పల్స్ ఎన్డీఏకు 133-159 సీట్లు ఇవ్వగా, మహాకూటమికి 75-101, ప్రశాంత్ కిషోర్ జనసురాజ్&zwnj;కు 0-5, ఇతర అభ్యర్థులకు 2- 8 సీట్లు వస్తాయని అంచనా వేసింది.</p> <p style="text-align: justify;"><strong>3.</strong> ఐఏఎన్ఎస్- మాట్రిజ్ (ఏబీపీ న్యూస్) ప్రకారం ఎన్డీఏ కూటమి 147-167 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> 65-73 సీట్లు, జేడీయూ 67- 75, ఎల్&zwnj;జేపీ-ఆర్ 7-9 ీసట్లు, హమ్ 4-5 సీట్లు, ఆర్&zwnj;ఎల్&zwnj;ఎం 1-2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మహాకూటమి 70-89 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, ఇందులో ఆర్&zwnj;జేడీ 53-58, <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> 10-12, వీఐపీ 1-4 మరియు లెఫ్ట్ పార్టీలు 9-14 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు.</p> <p style="text-align: justify;"><strong>243 స్థానాలకు ఎన్నికలు</strong></p> <p style="text-align: justify;">బిహార్ అసెంబ్లీలోని 243 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఎర్లీ ట్రెండ్స్ మొత్తం ఎన్డీఏకు విజయం సాధించే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. అయితే, తుది ఫలితాలు వచ్చే వరకు మెజార్టీని ఖచ్చితంగా చెప్పలేం. ఎన్డీఏ, మహాకూటమి మధ్య పోరు చాలా తీవ్రంగా ఉన్నట్లు కనిపించినా, చివరికి నితీష్ కుమార్ తమ కూటమిని విజయం వైపు నడిపిస్తున్నారు. తేజస్వి యాదవ్ కు మరోసారి నిరాశే ఎదురుకానుంది. ఎన్నికల వ్యూహకర్త, జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ఈ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు.&nbsp;</p>
Read Entire Article