Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతీయ మండళ్లు- వచ్చే బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు

2 days ago 1
ARTICLE AD
<p><strong>Andhra Pradesh:</strong>ఆంధ్రప్రదేశ్&zwnj;ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి విషయంలో ఎలాంటి విభేదాలు వచ్చేందుకు ఆస్కారం లేకుండా ఉండేలా ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దీనికి సీనియర్ ఐఏఎస్&zwnj;లను పాలనాధికారులుగా నియమించనుంది. అభివృద్ధి వికేంద్రీకరణ సజావుగా సాగేందుకు దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే రాష్ట్రాన్ని మూడు జోన్&zwnj;లుగా విభజించనున్నారు. ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ అనే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసి అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> ప్రకటించారు.&nbsp;</p> <p>ఈ అభివృద్ధి మండళ్ల ఏర్పాటుపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. బడ్జెట్&zwnj;లో మూడు మండళ్లకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని అంటున్నారు. భవిష్యత్&zwnj;లో ఏర్పడే పరిశ్రమలకు అనుమతులు, భూకేటాయింపులు, ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన ప్లాన్ తయారు చేయడం , వాటిని అమలు చేయడం ఈ మండళ్ల ప్రధాన కర్తవ్యం. ఈ మండళ్లలలో స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధులను కూడా భాగం చేయనున్నారు. బడ్జెట్&zwnj;లో కేటాయింపులు పూర్తి అయిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి తీసుకురానున్నారు.&nbsp;<br />&nbsp;<br />తిరుపతి కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి మండలి, అమరావతి కేంద్రంగా రాజధాని అభివృద్ధి మండలి, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు కానున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు అనే కాన్సెప్ట్&zwnj;ను తీసుకొచ్చింది. అయితే అనుకున్నంతగా ఇది విజయవంతం కాలేదు. ఎన్నికల్లో కూడా ఇది తిరస్కరణకు గురైంది.&nbsp;</p> <p>వైసీపీ మూడు రాజధానుల విధానాన్ని ప్రజలు తిరస్కరించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ పెట్టింది. అదే టైంలో ఇతర ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్డ్&zwnj;గా ఉన్నామని చెప్పేందుకు ఈ మూడు ప్రాంతీయ మండళ్లను కాన్సెప్టును తీసుకొచ్చింది. గతంలో రాష్ట్రవిభజన అంశంపై వేసిన శ్రీ కృష్ణ కమిటి కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అభివృద్ధి ఒకే ప్రాంతాంలో కేంద్రీకృతం కావడం రాష్ట్రవిభజనకు కారణమైందని పేర్కొంది. అందుకే భవిష్యత్&zwnj;లో ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.&nbsp;&nbsp;</p>
Read Entire Article