Ammayi garu Serial Today February 13th: అమ్మాయి గారు సీరియల్: మూలికల కోసం కొండెక్కిన రాజు, రూపలు.. జీవన్‌తో కలిసి తల్లీకొడుకుల కుట్ర!

9 months ago 8
ARTICLE AD
<p><strong>Ammayi garu Serial Today Episode </strong>రూపని మామయ్య పిలుస్తాడు. దీపక్, విజయాంబికలు టెన్షన్ పడతారు. స్వామీజీ, రూపలు రాజుని కలుస్తారు. మందారం మళ్లీ మామూలు మనిషి అవుతుందని అదంతా నేను చూసుకుంటానని ఆయన చెప్తారు. దీపక్, విజయాంబికలు చాటుగా చూస్తారు. వాళ్లు ఏం మాట్లాడుకుంటారో వింటారు.&nbsp;</p> <p><strong>స్వామీజీ:</strong> ఇప్పుడు మందారాన్ని మూలికలతో బతికించవచ్చు. వసంతంలో ఉండే మూలికలు బాగా పని చేస్తాయి. ఒక్క సారి వసంతం పూర్తయిపోతే అవి వాటి శక్తిని కోల్పోతాయి. అందుకే మనం ఈలోపే వాటిని సంపాదించాలి. వాటిని తీసుకురావాలి అంటే నల్లమల అడవుల్లో ఎత్తైన ప్రదేశంలో ఉన్నాయి. నా శిష్యులు ఇంకా కుంభ మేళలోనే ఉన్నారు. నేను వెళ్లాలంటే ఇక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి.<br /><strong>రాజు:</strong> నేను వెళ్తాను స్వామి.<br /><strong>రూప:</strong> నేను వెళ్తా.<br /><strong>విజయాంబిక:</strong> వీళ్లు అడవికి వెళ్తే వీళ్లని అక్కడ చంపేద్దాం.&nbsp;<br /><strong>రాజు:</strong> మీరు వద్దు అమ్మాయిగారు అడవి చాలా ప్రమాదం మీరు రావొద్దు. పైగా పెద్దయ్య గారికి తెలిసినా ఒప్పుకోరు. స్వామీజీ ఎలా వాటిని గుర్తించాలో చెప్తారు. ఒంటరిగా వెళ్లడం మంచిది కాదు అంటారు. దాంతో రూప కూడా వస్తానని అంటుంది.&nbsp;</p> <p>రూప, రాజులు బయల్దేరుతారు. ఇక స్వామీజీ కొడుకు దగ్గరకు వెళ్లి నీ భార్య కదలకుండా అలా ఉంటే నీకు కనీసం బాధ లేదని తిడతారు. ఇక స్వామీజీ రూపని మూలికలు కోసం అడవికి పంపానని సూర్యప్రతాప్&zwnj;తో చెప్తాడు. సూర్యప్రతాప్ కంగారు పడితే ఏం భయం లేదని మంచి కార్యానికి దేవుడి అండదండలు &nbsp;ఉంటాయని చెప్తారు. ఇక స్వామీజీ మందారానికి వైద్యం మొదలు పెడతారు. దీపక్ వాళ్లు జీవన్&zwnj;కి కాల్ చేస్తారు. రాజు, రూపలు అడవికి వెళ్తున్నారని వాళ్లని అడ్డుకోమని చెప్తాడు. వాళ్ల సంగతి నేను చూసుకుంటానని జీవన్ చెప్తాడు. విజయాంబిక జీవన్&zwnj;తో అవసరం ఉంటే ఇద్దరినీ చంపేయమని చెప్తుంది. జీవన్&zwnj; వాళ్లు రాఘవని వదిలేసి రాజు వాళ్లని ఆపడానికి వెళ్తారు.&nbsp;</p> <p>రూప రాజుతో నీతో ఇలా లాంగ్ డ్రైవ్ బాగుంది రాజు అని రాజుని గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఇద్దరూ స్వామీజీ చెప్పిన పర్వతం దగ్గరకు చేరుకొని నడిచి వెళ్తారు. జీవన్ కూడా అక్కడికి చేరుకుంటాడు. రాజు బైక్ చూసి జీవన్ వాళ్లు ముసుగు వేసుకొని రాజు వాళ్ల కోసం వెళ్తారు. స్వామీజీ చెప్పిన గుడి దగ్గరకు వెళ్లి ఆకులు గుర్తు పడతారు. స్వామీజీ చెప్పిన మూలికలు తీసుకొని మందారం కోలుకోవాలని ఆంజనేయ స్వామిని వేడుకుంటారు. ఇద్దరూ తిరుగు పయనం అవుతారు. జీవన్ వాళ్లు చూసి రాజు, రూపలను అడ్డుకుంటారు. రాజు రౌడీలను చితక్కొడతాడు. ఇక రూప దగ్గర ఉన్న మూలికల్ని రౌడీలు తీసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.&nbsp;</p> <p><strong>Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇది కదా కావాల్సింది.. కావేరిని చిన్నమ్మా అని పిలిచిన కార్తీక్.. ఏకాకైపోయిన శ్రీధర్!</strong></p>
Read Entire Article