విద్యార్థులకు నారా లోకేష్ గుడ్ న్యూస్

3 months ago 14
ARTICLE AD

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో తీసుకుంటున్న పలు నిర్ణయాల పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మేలు కలిగేలా నారా లోకేష్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా వాటి అమలుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఐటి శాఖను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేలా నారా లోకేష్ ముందడుగు వేస్తున్నారు.  

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి చేపట్టినప్పటినుంచి ప్రజల కోసమే పని చేస్తున్నారు. పెన్షన్ పంపిణి కార్యక్రమం నుంచి సూపర్ సిక్స్ లోని ప్రతి పథకం అమలులో చంద్రబాబు అడుగులు ప్రజలను సంతోషపెడుతున్నాయి. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన BC, EWS మరియు మైనారిటీ విద్యార్థుల కోసం మొత్తం రూ.1,198 కోట్ల RTF (Reimbursement of Tuition Fee) నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది.

 * BC విద్యార్థులకు: రూ.258 కోట్లు + రూ.477 కోట్లు

* ⁠EWS (EBC & OC): రూ.365 కోట్లు

* ⁠మైనారిటీ విద్యార్థులకు: రూ.98 కోట్లు విడుదల కానున్నాయి. 

ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక భారం తగ్గి, వారి విద్యను సజావుగా కొనసాగించడానికి మరింత సహాయం పడుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ తో లాభపడుతున్న విద్యార్థులు నారా లోకేష్ కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు. 

Read Entire Article