YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం

2 months ago 7
ARTICLE AD
<p>YSRCPLP meeting: &nbsp;అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, ప్రతిపక్ష గొంతు నొక్కేలా అధికార కూటమి వ్యవహరిస్తోందన్న కారణంగా అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ నిర్ణయించారు. &nbsp;ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వరని, కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఉండదని జగన్ &nbsp;అభిప్రాయపడ్డారు. ప్రజా క్షేత్రంలోనే ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అందుకే అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ తన ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.<br />&nbsp;<br />అసెంబ్లీకి జగన్ సహా ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి &nbsp;విషయంలో మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించారు. మండలిలో వైఎస్సార్&zwnj;సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ తమ గళాన్ని వినిపించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలందరూ తప్పనిసరిగా మండలి సమావేశాలకు హాజరై, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, బిల్లులపై లోతుగా చర్చించాలని జగన్ ఆదేశించారు.<br />&nbsp;<br />అసెంబ్లీకి వెళ్లని సమయంలో ఎమ్మెల్యేలు ఖాళీగా ఉండకుండా, నియోజకవర్గాల్లో పర్యటించాలని జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న &nbsp;సూపర్ సిక్స్ పథకాల వైఫల్యాలు, పెరిగిన ధరలు, శాంతి భద్రతల సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి చైతన్యపరచాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న అప్రజాస్వామిక పరిణామాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రాకపోవడం వల్ల ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయని అధికార పక్షం విమర్శిస్తోంది. అయితే, గౌరవం లేని చోట ఉండి ప్రయోజనం లేదని <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> వర్గం వాదిస్తోంది. &nbsp;&nbsp;</p> <p>&nbsp;</p>
Read Entire Article