మిర్చి రైతుల ఇబ్బందులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదని జగన్ ఫైర్ అయ్యారు. బుధవారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన జగన్.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం క్వింటాకు రూ.10-12 వేలు కూడా రావడం లేదన్నారు. రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.