Vishwa Hindu Parishad: కనీసం ముగ్గురిని కనండి.. హిందువుకుల వీహెచ్​పీ విజ్ఞప్తి

10 months ago 8
ARTICLE AD
<p>Declining Birth Rate In India | దేశంలో హిందువుల జననాల రేటు తగ్గుతోందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్​పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలు ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చింది. ఉత్తరప్రదేశ్&zwnj; ప్రయాగ్&zwnj;రాజ్&zwnj;లోని మహాకుంభ్ నగర్&zwnj;లో జరిగిన విరాట్ సంత్ సమ్మేళన్&zwnj;లో సీఎం యోగి ఆదిత్యనాథ్​, వీహెచ్&zwnj;పీ కేంద్ర ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాంగ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బజరంగ్ లాల్ బాంగ్రా మాట్లాడుతూ.. హిందువుల జననాల రేటు తగ్గడం వల్ల దేశంలోని హిందూ జనాభాలో సమతుల్యత లోపించిందన్నారు. హిందువుల జననాల శాతం తగ్గుతోందన్నారు. అందుకే ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలును కనాలని కోరారు.</p> <p><strong>బంగ్లాదేశ్&zwnj;లో హిందువులపై జరుగుతున్న దాడులపై చర్చ</strong><br />బంగ్లాదేశ్&zwnj;లో హిందువులపై జరుగుతున్న దాడులపైనా సమావేశంలో చర్చించారు. బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందని బాంగ్రా అన్నారు. బంగ్లాదేశ్​లో తలెత్తిన పరిస్థితులు భారత్​లోనూ వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ అంశంపై హిందువులు లోతుగా ఆలోచించాలని ఆయన కోరారు. వక్ఫ్ బోర్డు నిరంకుశ, అపరిమిత హక్కులను పరిమితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చట్ట సంస్కరణల చట్టాన్ని తీసుకువస్తోందన్నారు.</p> <p><strong>ప్రయత్నాల ఫలితాన్నిప్రపంచం చూస్తోంది</strong><br />కార్యక్రమానికి హాజరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం చూసే ఈ మహా కుంభమేళాలో భారతదేశ సనాతన సంప్రదాయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. యావత్ దేశం సుభిష్ఠంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ చేస్తున్న కృషిని కొనియాడారు. వీహెచ్​పీ ప్రయత్నాల ఫలితాన్ని ఈ రోజు ప్రపంచం మొత్తం చూస్తోందని ఆయన పేర్కొన్నారు.</p> <p><strong>అశోక్ సింఘాల్&zwnj; ఆత్మ ఉప్పొంగుతుంది</strong><br />యోగి ఆదిత్యనాథ్​ మాట్లాడుతూ..&lsquo;గంగా, యమునా, సరస్వతి లాంటి పవిత్ర నదుల ఒడ్డున ఉన్న మన &nbsp;పుణ్యభూమిపై వీహెచ్&zwnj;పీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నమధ్య భౌతికంగా లేని అశోక్ సింఘాల్&zwnj;ని మనం గుర్తుచేసుకున్నాం. సనాతన ధర్మం 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. అయోధ్యలో రామ్​ లల్లా ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం చూసి &nbsp;అశోక్ సింఘాల్&zwnj; ఆత్మ ఉప్పొంగిపోతుంది&rsquo; అని అన్నారు.</p> <p><strong>మధుర, కాశీ కల సాకారం కాబోతోంది</strong><br />2016లో కేవలం రెండు లక్షల మంది మాత్రమే అయోధ్యను సందర్శించారని, &nbsp; 2024లో 15 కోట్ల మంది మహాకుంభాన్ని సందర్శించారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కొత్త అయోధ్య, కొత్త కాశీకి దివ్యమైన రూపం కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరామ జన్మభూమి తర్వాత మధుర, కాశీ కల సాకారం కాబోతోందని ఆయన పేర్కొన్నారు.</p> <p>Also Read:&nbsp;<a href="https://telugu.abplive.com/news/left-from-prayagraj-maha-kumbh-mela-due-to-safty-issues-monalisa-195424" target="_blank" rel="noopener">Monalisa: భద్రత కారణాలతో కుంభమేళా నుంచి వెళ్లిపోయిన మోనాలిసా - తీవ్ర ఇబ్బందులకు గురయ్యానంటూ వీడియో</a></p>
Read Entire Article