Viral News: పెళ్లి బారాత్‌ డీజేతో కోళ్లు చచ్చిపోయాయి! వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు!

1 month ago 5
ARTICLE AD
<p><strong>Viral News:</strong> ప్రాంతం ఏదైనా సరే పెళ్లి ఊరేగింపు అంటే మినిమమ్ ఉంటుంది. ఇలాంటి ఊరేగింపు కారణంగా తన ఫామ్&zwnj;లో ఉన్న కోళ్లు చచ్చిపోయినట్టు ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊరేగింపులో భారీ శబ్దాలతో డీజే సౌండ్స్ పెట్టడం వల్లే ఇదంతా జరిగిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. &nbsp;అనుమతికి మించి డీజే సౌండ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.&nbsp;</p> <p>ఉత్తర్&zwnj;ప్రదేశ్&zwnj;లోని సుల్తాన్&zwnj;పూర్&zwnj;లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏప్రిల్&zwnj; 25న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో బబ్బన్ విశ్వకర్మ కుమార్తె వివాహ ఊరేగింపు జరిగింది. ఈ బారాత్&zwnj; కుద్వార్ ప్రాంతంలోని రామ్&zwnj; భద్ర పూర్వ నుంచి బయల్దేరింది. ఈ ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన డీజే సిస్టమ్&zwnj; నుంచి భారీ స్థాయిలో సౌండ్స్ వచ్చాయి.&nbsp;</p> <p>ఈ ఊరేగింపు సాబిర్ అలీకి చెందిన సాబిర్&zwnj; అలీ పౌల్ట్రీ ఫామ్&zwnj; ముందు నుంచి వెళ్లింది. ఆ సమయంలో డీజే నుంచి వచ్చిన భయంకరమైన శబ్దాలకు పౌల్ట్రీ ఫామ్&zwnj;లోని కోళ్లు భయాందోళనకు గురైనట్టు అలీ పేర్కొన్నారు. ఆ హోరును భరించలేక సుమారు 140 కోట్లు కొట్టుకొని చనిపోయినట్టు చెప్పారు.&nbsp;</p> <p>సాబిర్ అలీ మంగళవారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పర్సీపూర్ గ్రామానికి చెందిన డీజే ఆపరేటర్ కవి యాదవ్&zwnj;పై కేసు నమోదైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిమితికి మించిన శబ్దంతో పాటలు ప్లే చేశారా అనే కోణంలో విచారణ సాగుతోంది. &nbsp;</p>
Read Entire Article