Vijayawada Crime News: ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ విచారణలో విస్తుపోయే అంశాలు: సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ

3 weeks ago 4
ARTICLE AD
<p>విజయవాడ లో పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు తీవ్రవాద సంబంధాలలు ఉన్న వ్యక్తులని కోర్టు లో హాజరు పరిచారు పోలీసులు. &nbsp;ఈ అంశం ఫై మీడియా తో మాట్లాడిన విజయవాడ ఇంచార్జ్ సీపీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ కీలక విషయాలు తెలిపారు&nbsp;</p> <p><strong>ఈ ముగ్గురికీ దేశం వెలుపల ఉన్న వారితోనూ సంబంధాలు: పోలీసులు&nbsp;</strong></p> <p>విజయవాడ సీపీ *సర్వ శ్రేష్ఠ త్రిపాథ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 5గురు ఉన్న గ్రూవ్ ని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా ముగ్గురు దొరికారు. ఇద్దరు పరారీ లో ఉన్నారు.అరెస్ట్ అయిన నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (UAPA) కింద విజయవాడలోని రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.ఈ ముగ్గురూ విజయవాడ కు చెందిన వారే. వీరు ఇన్&zwnj;స్టాగ్రామ్&zwnj;లో రెండు ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒకటి ISIS సిద్ధాంతాల పైన, మరొకటి AQIS (Al-Qaeda in the Indian Subcontinent) పేరుతో నడుస్తోంది.</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/03/25/352da8724343d6560cf65aca8e9225241774403079158233_original.jpeg" /></p> <p>అరెస్ట్ అయిన వారి పేర్లు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, దానిష్, మరియు మీర్జా సుహైబ్.​వీరు ఆన్&zwnj;లైన్ ద్వారా తీవ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దేశం వెలుపల ఉన్న వ్యక్తులతో కూడా వీరికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.​పోలీసుల సోదాల్లో మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.​దేశ భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని త్రిపాఠి తెలిపారు.</p> <p><strong>&nbsp;పిల్లలు ఆన్&zwnj;లైన్&zwnj;లో ఏం చేస్తున్నారో పెద్దలు గమనిస్తూ ఉండాలి: పోలీసులు&nbsp;</strong></p> <p>ఈ డిజిటల్ యుగం లో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలకు యువత లోనుకాకుండా జాగ్రత్త వహించాలని పెద్దలకు సూచించారు విజయవాడ సీపీ త్రిపాఠీ.ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో తదుపరి విచారణ కొనసాగుతోంని కూడా ఆయన అన్నారు. తీవ్రవాదులతో ఈ ముగ్గురికీ ​డబ్బు లావాదేవీలు ఏవైనా జరిగాయా అనే కోణం లో కూడా విచారణ జరుగుతోంది. వారు డబ్బు కోసమే ఇది చేశారని అప్పుడే చెప్పలేం అని కూడా పోలీసులు అంటున్నారు.ఎందుకంటే వారు వేరే రకంగా కంటెంట్ చేస్తున్నారు.&nbsp;</p> <p>ఆ కంటెంట్&zwnj;లో కొన్నిటిని చూసి, వారు రెచ్చగొట్టబడ్డారని గుర్తించినట్టు పోలీసులు చెబుతున్నారు.​ఈ కార్యకలాపాలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయని పోలీసులు గమబించారు.​అరెస్టు చేయబడిన వారిలో ముగ్గురు విజయవాడకు చెందినవారే అయినప్పటికీ ఈ గ్రూపుతో సంబంధం ఉన్నవారిలో మిగిలిన వారు తెలంగాణ, బీహార్, ఢిల్లీ మరియు మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాలకు చెందినవారిగా పోలీసులు చెబుతున్నారు..</p> <p><strong>పగలంతా మామూలు వ్యాపారాలు.. రాత్రి తీవ్రవాదులతో సంబంధాలు?</strong></p> <p>ఇప్పుడు అరెస్ట్ అయిన రహ్మతుల్లా, దానిష్,సుహైల్ అనే వ్యక్తులు డిగ్రీ కాలేజీ నుండి క్లాస్&zwnj;మేట్స్. అందరూ విజయవాడ లో ఉండేవారే.వారంతా ఎక్కడ కలిసేవారు , ఏం మాట్లాడుకున్నారు, &nbsp;వారి ప్లాన్ ఏంటి అనే విషయాలు &nbsp;విచారణలో తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నా ఈ ముగ్గురు పగలంతా మాములు వ్యాపారాలు చేసుకుంటా జనంలో కలిసిపోయేవారే అని తెలిసింది. ఒకరు ఫుడ్ డెలివరీ బాయ్ గానూ, ఒకరు లేసర్ ప్రింటర్ కాగా , మరొకరు ఫాలుదా అమ్మే వ్యాపారి. కానీ వీరి కామన్ ఇంట్రెస్ట్ మాత్రం తీవ్ర వాద కార్యకలాపాల మీద నే. దేశ చిహ్నలను సోషల్ మీడియా లో అగౌరవ పరుస్తూ కంటెంట్ చేయడం దగ్గర నుండి తీవ్రమైన భావజాల ప్రచారం వరకు దిగిపోయారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దానితో అసలు విజయవాడలో వీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న యాంగిల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా విజయవాడ నగరంలో &nbsp;తీవ్రవాద భావజాలం ఉన్న ముగ్గురు యువకులు అరెస్ట్ కావడం &nbsp;తో విజయవాడ పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుందని పలువురు భావిస్తున్నారు. అయితే వీరితో సంబంధాలు ఉన్నవారు ఇంకా ఎంతమంది ఉన్నారు &nbsp;అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దృష్టి పెట్టారు. దానితో త్వరలోనే మరిన్ని నివ్వెరపోయే వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.</p>
Read Entire Article