Vetlapalem Blast :వేట్ల‌పాలెం పేలుడు ఘ‌ట‌నపై సిట్ విచార‌ణ పూర్తి! భారీ విస్ఫోటనానికి కారణం తేల్చిన అధికారుల బృందం!

1 week ago 2
ARTICLE AD
<p><strong>Vetlapalem Blast :&nbsp;</strong>కాకినాడ జిల్లా వేట్ల&zwnj;పాలెం పేలుడు ఘ&zwnj;ట&zwnj;నపై సిట్ విచార&zwnj;ణ పూర్తి చేసింది. బాణాసంచా భారీ విస్ఫోటనానికి కారణాన్ని అధికారులు తేల్చి చెప్పారు.&nbsp;దేశవ్యాప్తంగా తీవ్ర సంచ&zwnj;ల&zwnj;నం క&zwnj;లిగించిన వేట్ల&zwnj;పాలెం భారీ విస్పోట&zwnj;నం ఘ&zwnj;ట&zwnj;న తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్ర&zwnj;మాదంలో ఘ&zwnj;ట&zwnj;న స్థ&zwnj;లంలోనే 21 మంది వ&zwnj;ర&zwnj;కు మృతిచెంద&zwnj;గా కాకినాడ ప్ర&zwnj;భుత్వ ఆసుప&zwnj;త్రిలో చికిత్స పొందుతూ మ&zwnj;రో ఎనిమిది మంది మృత్య&zwnj;వాత&zwnj;ప&zwnj;డ్డారు.</p> <p>ఈ దుర్ఘ&zwnj;ట&zwnj;న కాకినాడ జిల్లాలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కిపాటుకు గురిచేసింది.. అయితే ఈ దుర్ఘ&zwnj;ట&zwnj;న జ&zwnj;రిగిన రోజు రాత్రికే రాష్ట్ర ముఖ్య&zwnj;మంత్రి నారా చంద్ర&zwnj;బాబు నాయుడు హుటాహుటీన వేట్ల&zwnj;పాలెం వ&zwnj;చ్చి ఘ&zwnj;ట&zwnj;న స్థలాన్ని ప&zwnj;రిశీలించారు.. కాకినాడ జీజీహెచ్&zwnj;లో చికిత్స పొందుతున్న క్ష&zwnj;త&zwnj;గాత్రుల&zwnj;ను ప&zwnj;రామ&zwnj;ర్శించారు. అక్క&zwnj;డే మృతుల&zwnj;కు రూ.20 ల&zwnj;క్ష&zwnj;ల ప&zwnj;రిహారాన్ని ప్ర&zwnj;క&zwnj;టించారు. బాధ్యులైన వారిపై క&zwnj;ఠిన చ&zwnj;ర్య&zwnj;లు తీసుకుంటామ&zwnj;ని, అవ&zwnj;స&zwnj;ర&zwnj;మైతే విస్పోట&zwnj;నానికి కార&zwnj;కులైన వారి ఆస్తులు జ&zwnj;ప్తుచేసి బాధిత కుటుంబాల&zwnj;కు అంద&zwnj;జేస్తామ&zwnj;ని సీఎం ప్ర&zwnj;క&zwnj;టించారు. అదే స&zwnj;మ&zwnj;యంలో ఈ ప్ర&zwnj;మాదంపై సిట్ ద&zwnj;ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్న&zwnj;ట్లు ప్ర&zwnj;క&zwnj;టించారు.&nbsp;</p> <h3>వేట్ల&zwnj;పాలెంలో ప&zwnj;ర్య&zwnj;టించిన సిట్ బృందం...</h3> <p>కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన బాణాసంచా తయారీ కేంద్రం భారీ విస్ఫోటనంలో 28 మంది కార్మికులు మృత్యువాత పడిన ఘటనపై ఏపీ ప్ర&zwnj;భుత్వం సిట్ ఏర్పాటు చేసిన వేళ రాష్ట్ర ప్ర&zwnj;భుత్వ ప్రిన్సిపల్ సెక్ర&zwnj;ట&zwnj;రీ ఎం.సురేష్ కుమార్ సారథ్యంలోని అధికారుల బృందం బుధ&zwnj;వారం వేట్ల&zwnj;పాలెంలో ప&zwnj;ర్య&zwnj;టించింది. ప్ర&zwnj;మాదం జ&zwnj;రిగిన వేట్లపాలెం గ్రామంలోని &nbsp;బాణాసంచా విస్ఫోటన స్థలాన్ని కమిటీ బృందం పరిశీలించింది.</p> <p>వేట్లపాలెం గ్రామంలో జరిగిన భారీ విస్పోటనంపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఆయ&zwnj;న&zwnj;, ప&zwnj;లుశాఖ&zwnj;ల అధికారుల&zwnj;ను విచారించారు. &nbsp; ప్రిన్సిప&zwnj;ల్ సెక్ర&zwnj;ట&zwnj;రీ సురేష్ కుమార్ నేతృత్వంలో సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ అతిథి గృహంలో ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందిన కార్మికులను, ఈ ఘటనలో సస్పెండ్ కాబడిన నాలుగు శాఖల అధికారులను సిట్ బృందం విచారించింది. ప్రమాదంపై ప్రాథమికంగా జిల్లా కలెక్టర్, అగ్నిమాపక శాఖ తదితర అధికారుల నుంచి వివరాలు సేకరించిన సిట్ అధికారులు ప్రమాదానికి సంబంధించి రెవెన్యూ, పోలీస్, ఫైర్, లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులతో చ&zwnj;ర్చించి కీల&zwnj;క విష&zwnj;యాల&zwnj;ను తెలుసుకున్నారు. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్పోట&zwnj;నానికి కార&zwnj;ణం నిర్వాహకులేన&zwnj;ని విచారణ కమిటీ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం సురేష్ కుమార్ స్ప&zwnj;ష్టం చేశారు. &nbsp;</p> <h3>భారీగా నిల్వ&zwnj;చేసిన మందుగుండు సామాగ్రే ప్రమాదానికి కారణం..</h3> <p>వేట్లపాలెం విస్పోట&zwnj;న ఘ&zwnj;న&zwnj;ట&zwnj;పై అధికారుల&zwnj; విచార&zwnj;ణ అనంత&zwnj;రం ప్రిన్సిప&zwnj;ల్ సెక్ర&zwnj;ట&zwnj;రీ సురేష్&zwnj;కుమార్ మీడియాకు వివ&zwnj;రాల&zwnj;ను వెల్ల&zwnj;డించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో కేవలం 15 కిలోలు మాత్రమే మందు గుండు సామాగ్రి తయారీకి అనుమతులు పొందారని అన్నారు. త&zwnj;యారీ కేంద్రంలో పదిమంది లోపు మాత్రమే కార్మికులను పనులకు ఉపయోగించుకునేందుకు అనుమ&zwnj;తులున్నాయ&zwnj;న్నారు. కానీ యజమానికి వందలాది కిలోల ముడి సరుకు తయారీ కేంద్రంలో నిల్వలు ఉంచడంతోపాటు, 30 మందికిపైగా కార్మికులను ఉపయోగించినట్టు విచార&zwnj;ణ&zwnj;లో తేలింద&zwnj;న్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించ&zwnj;క&zwnj;పోవ&zwnj;డం, ప్ర&zwnj;మాదానికి కార&zwnj;ణంగా గుర్తించామ&zwnj;న్నారు.</p> <p>మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి బాణాసంచా తయారీ కేంద్రాలను పలు శాఖల అధికారులు తనిఖీలు చేయల&zwnj;న్నారు. యజమానులే నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలా గాక యాజమాన్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఇలాంటి ప్రమాదాలకు &nbsp;అవకాశం కలుగుతుందన్నారు. వేట్ల&zwnj;పాలెం భారీ విస్ఫోటనంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్&zwnj;గా ఉందని, దానిలో భాగంగానే సంఘటన జరిగిన వెంటనే నాలుగు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను ఇప్ప&zwnj;టికే సస్పెండ్ చేశారని వివరించారు. విచార&zwnj;ణ నివేదిక&zwnj;ను ప్రభుత్వానికి స&zwnj;మ&zwnj;ర్పిస్తామ&zwnj;న్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ. బిందు మాధవ్, జెసీ అపూర్వభరత్, పెద్దాపురం ఆర్డీవో శ్రీధర్, పెద్దాపురం డీఎస్పీ వి.వి. సత్యనారాయణ, ఈ ఘ&zwnj;ట&zwnj;న&zwnj;లో బాధ్యులై సస్పెండ్ కాబడిన ఆర్డీవో, డీఎస్పీలు కే రమణి, డీఎస్పీ డి శ్రీహరి రాజు త&zwnj;దిత&zwnj;రులు విచార&zwnj;ణ&zwnj;కు హాజ&zwnj;ర&zwnj;య్యారు.</p>
Read Entire Article