<p><strong>Vallabhaneni Vamsi in trouble:</strong> ఫిర్యాదుదారుడ్ని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న వల్లభనేని వంశీ అక్రమాలను తేల్చడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ పని చేస్తుంది. సభ్యులుగా మరో ఇద్దర్ని నియమించారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. మట్టి, గ్రావెల్ తవ్వకంతో పాటు చాలా అభియోగాలు ఆయనపై ఉన్నాయి. వాటన్నింటినీ తేల్చడానికి ప్రభుత్వం సిట్ ను నియమించింది. </p>