US Iran War: 48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

3 weeks ago 3
ARTICLE AD
<p style="text-align: justify;">వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ నాయకత్వం సవాల్ విసరడాన్ని అగ్రరాజ్యం జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం (మార్చి 22) నాడు ఇరాన్&zwnj;కు మరో హెచ్చరిక జారీ చేశారు. 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని తెరవకపోతే, ఇరాన్&zwnj;కు చెందిన అనేక విద్యుత్ ప్లాంట్&zwnj;లపై దాడి చేసి పూర్తిగా నాశనం చేస్తామని, ఈ దాడిని అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ నుండి ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు.</p> <p style="text-align: justify;">ట్రూత్ సోషల్ పోస్ట్&zwnj;లో, అమెరికా-ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్&zwnj;పై దాడులు, ప్రతిదాడుల తర్వాత ఇరాన్ సైన్యం పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్న ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన జలమార్గమైన హర్మూజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ ఇరాన్&zwnj;కు టైం ఇచ్చారు. 48 గంటల్లో చెప్పిన పని చేయకపోతే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.</p> <p style="text-align: justify;"><strong>విద్యుత్ ప్లాంట్&zwnj;లను ధ్వంసం చేస్తాం - ట్రంప్</strong><br />ట్రంప్ తన పోస్ట్&zwnj;లో ఇలా పోస్ట్ చేశారు. ఇరాన్ ఇప్పటినుంచి సరిగ్గా 48 గంటల్లోపు హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే, అమెరికా సైన్యం రంగంలోకి దిగి ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేసి పూర్తిగా నాశనం చేస్తుంది. అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ నుండి తమ దాడి ప్రారంభమవుతుందని ట్రంప్ హెచ్చరించారు.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">🚨 &ldquo;If Iran doesn&rsquo;t FULLY OPEN, WITHOUT THREAT, the Strait of Hormuz, within 48 HOURS from this exact point in time, the United States of America will hit and obliterate their various POWER PLANTS, STARTING WITH THE BIGGEST ONE FIRST&hellip;&rdquo; - President DONALD J. TRUMP <a href="https://t.co/htLz1A0Mf7">pic.twitter.com/htLz1A0Mf7</a></p> &mdash; The White House (@WhiteHouse) <a href="https://twitter.com/WhiteHouse/status/2035516932498030879?ref_src=twsrc%5Etfw">March 22, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;"><strong>చమురు ధరలలో భారీ పెరుగుదల</strong><br />హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికాలోనూ పరిస్థితి ఆశించిన తీరుగా లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల యుద్ధం ముగిస్తామని సంకేతాలు ఇచ్చి.. గంటల వ్యవధిలోనే మరో భారీ దాడి తప్పదని వ్యాఖ్యలు చేయడం పలు దేశాల్లో గుబులు రేపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వెళ్ళే హర్మూజ్ జలసంధిని తెరిచి, ఓడల రాకపోకలకు అంతరాయం కలిగించకూడదని ఇరాన్ కు సూచించారు. 48 గంటల్లో అలా చేయని పక్షంలో ఇరాన్ లోని పవర్ ప్లాంట్లు, అణు విద్యుత్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తామన్నారు.</p> <p style="text-align: justify;">హర్మూజ్ జలసంధి భద్రత, నిఘా దానిని ఉపయోగించే ఇతర దేశాలు నిర్వహించాలని ట్రంప్ అన్నారు. అమెరికాకు ఈ అధికారం అవసరం లేదన్నారు. ఇటీవల శుక్రవారం వరకు నౌకలపై లోడ్ చేసిన ఇరాన్ చమురుపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.</p> <p style="text-align: justify;">ఈ మినహాయింపు ప్రపంచ మార్కెట్లలో దాదాపు 140 మిలియన్ బ్యారెల్స్ చమురును తీసుకువస్తుందని, ఇంధన సరఫరాపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఎక్స్ లో పేర్కొన్నారు.</p> <p style="text-align: justify;">&nbsp;</p>
Read Entire Article