<p><strong>Railway Employees Bonus:</strong> ప్రధాని <a title="నరేంద్ర మోదీ" href="https://telugu.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a> నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 24, 2025 నిర్వహించిన సమావేశంలో రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించింది. 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌గా రూ. 1,865.68 కోట్లు విడుదల చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ బోనస్ దీపావళి, చట్ పూజా పండుగల ముందే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అంతేకాకుండా, బిహార్‌లో రైల్వే డబుల్ లైన్, హైవే ప్రాజెక్టులు, షిప్‌బిల్డింగ్‌కు ప్యాకేజీలకు కూడా మంత్రివర్గం లైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాలు ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.</p>
<p>గత సంవత్సరాల్లోనూ ఇలాంటి బోనస్‌లు ప్రకటించినప్పటికీ, ఈసారి మొత్తం మొత్తం పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ నిర్ణయం దాదాపు 11 లక్షల కుటుంబాలకు ఆర్థిక ఊరటను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. బిహార్‌లో రైల్వే వ్యవస్థను బలోపేతం చేయడానికి మంత్రివర్గం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. భక్తియార్‌పూర్ నుంచి రాజగిరి-తిలైయా వరకు రైల్వే లైన్‌ను డబుల్ లైన్‌గా మార్చడానికి రూ.2,192 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం సింగిల్ లైన్‌గా ఉన్న ఈ మార్గం సామర్థ్యం పరిమితంగా ఉంది. డబుల్ లైన్ పూర్తయిన తర్వాత రైలుల ప్రయాణ వేగం, సామర్థ్యం పెరుగుతాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు ఈ ప్రాజెక్ట్ బిహార్‌లోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ అందిస్తుంది, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. </p>
<p>బిహార్‌కు మరో బహుమతిగా, NH-139W హైవేలో సాహెబ్‌గంజ్-అరేజాజ్-బేతియా భాగాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం పొడవు 78.942 కిలోమీటర్లు, ఖర్చు రూ.3,822.31 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ద్వారా బిహార్‌లోని మూడు జిల్లాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది, వాహన రవాణా సులభతరం అవుతుంది. హైబ్రిడ్ మోడ్‌లో ప్రైవేట్-పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా నిర్మాణం జరుగుతుంది, దీనివల్ల ఖర్చు తగ్గుతూ వేగం పెరుగుతాయి. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత స్థానిక ఆర్థిక వ్యవస్థకు, వ్యాపారాలకు ఊరట కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. </p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en">Union Cabinet, chaired by Prime Minister Shri <a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> Ji, has approved a ₹69,725-crore package to revitalise India’s shipbuilding and maritime sector.<br /><br />The Shipbuilding Financial Assistance Scheme has been extended until 31 March 2036 with a total corpus of ₹24,736 crore,… <a href="https://t.co/B6MdbGYHgt">pic.twitter.com/B6MdbGYHgt</a></p>
— Nitin Gadkari (@nitin_gadkari) <a href="https://twitter.com/nitin_gadkari/status/1970796204528398396?ref_src=twsrc%5Etfw">September 24, 2025</a></blockquote>
<p>
<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>
<br />అలాగే దేశవ్యాప్తంగా షిప్‌బిల్డింగ్, మెరైన్ ఫైనాన్సింగ్, దేశీయ సామర్థ్యాన్ని పెంచడానికి రూ. 69,725 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీ ద్వారా భారతదేశం షిప్ బిల్డింగ్ రంగంలో ప్రపంచ స్థాయి సామర్థ్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది. మెరైన్ ఫైనాన్సింగ్‌కు ప్రోత్సాహం, దేశీయ షిప్‌యార్డుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి ఈ ప్యాకేజీలో చేర్చారు. భారత మెరైటైమ్ ఎకానమీని బలోపేతం చేస్తూ, ఎగుమతులను పెంచుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ప్యాకేజీ ప్రయోజనాలు ముఖ్యంగా కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి తీర పట్టణాల్లో ఉపాధి పెరగడానికి ఉపయోగపడతాయి. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/education/sbi-announces-sbi-platinum-jubilee-asha-scholarship-2025-full-details-220784" width="631" height="381" scrolling="no"></iframe></p>