<p>Tunnel between Gohpur and Numaligarh | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం (ఫిబ్రవరి 14) నాడు దేశంలోనే అత్యంత కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. బ్రహ్మపుత్ర నది కింద గోహ్‌పూర్, నుమాలిగఢ్ మధ్య రైలు, రోడ్డు టన్నెల్‌ (Twin-tube Road Rail tunnel )ను నిర్మించడానికి ప్రధాని మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ₹18,662 కోట్లతో నిర్మించే ఈ అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ రోడ్డు, రైలు టన్నెల్ పూర్తయితే 240 కిలోమీటర్ల దూరం కేవలం 34 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. బ్రహ్మపుత్ర నది కింద 15.8 కిలోమీటర్ల మేర ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్‌ను నిర్మించడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. <img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/14/ca9023dd6646ad525fcaf2b5c55428201771080413139233_original.png" /><br /><strong>దేశంలో తొలి ట్విన్ ట్యూబ్ అండర్ వాటల్ టన్నెల్</strong></p>
<p>దేశంలోనే మొదటిసారిగా ఇటువంటి ట్విన్-ట్యూబ్ అండర్ వాటర్ టన్నెల్ భారత ప్రభుత్వం నిర్మించబోతోంది. ఈ టన్నెల్‌లో రోడ్డు మార్గంలో వాహనాలు, పట్టాలపై రైళ్లు రెండూ నడిచే సౌకర్యం ఉంది. దీనివల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు సైన్యం, మందుగుండు సామాగ్రిని సైతం వేగంగా తరలించడానికి అవకాశం ఉంటుంది. ఒక ట్యూబ్‌లో సింగిల్ రైల్ ట్రాక్ సౌకర్యం ఉంటుంది.</p>
<p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/14/c3f79f9b038e13cda50796e5405ea9211771080436332233_original.png" /></p>
<p><strong>టన్నెల్ డిజైన్ ఎలా ఉంటుంది?</strong><br />కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకారం, ఈ టన్నెల్ నుండి రైళ్లు, వాహనాలు ఒకే సమయంలో వెళ్లేలా దీనిని డిజైన్ చేస్తారు. ఇందులో బ్యాలస్ట్ ట్రాక్ ఉంటుంది. రైళ్లు విద్యుత్తుతో నడుస్తాయి. టన్నెల్, అప్రోచ్ రోడ్, రైల్వే ట్రాక్ కలిపి మొత్తం 33.7 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 18,600 కోట్ల ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్ట్ ఖర్చును రోడ్డు రవాణా, రైల్వే, రక్షణ మంత్రిత్వ శాఖలు కలిసి భరించనున్నాయని పేర్కొన్నారు.</p>
<p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/14/5115e4129bbfb0ef7deb152c26c3260c1771080464729233_original.png" /></p>
<p><strong>గంటల ప్రయాణం ఇప్పుడు నిమిషాల్లోనే</strong><br />2 లైన్లుగా ట్విన్ ట్యూబ్ రొడ్డు, రైలు మార్గాలుగా డిజైన్ చేసిన ఈ సొరంగాలను బ్రహ్మపుత్ర నదిలో 32 మీటర్ల కింద నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 5 ఏళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత, గోహ్‌పూర్, నుమాలిగఢ్ మధ్య ప్రయాణ సమయం 6 గంటల నుండి కేవలం 20 నిమిషాలకు తగ్గుతుంది. దూరం 240 కిలోమీటర్ల నుండి కేవలం 34 కిలోమీటర్లకు తగ్గడంతో ఇది ఆర్మీకి సైతం ఎంతో కీలకంగా మారనుంది.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en">Cabinet approves India’s first Underwater twin-tube road rail tunnel under River Brahmaputra<br />🚇 4-lane tunnel | Gohpur - Numaligarh, Assam (34 km | ₹18,662 Cr)<br /><br />➡️ Strengthens the North-East as a gateway to the Act East policy<br />➡️ Distance reduced from 240 km to 34 km; travel… <a href="https://t.co/u8Cmj1bOmk">pic.twitter.com/u8Cmj1bOmk</a></p>
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) <a href="https://twitter.com/AshwiniVaishnaw/status/2022642395494433089?ref_src=twsrc%5Etfw">February 14, 2026</a></blockquote>
<p>
<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>
</p>
<p><strong>ఈశాన్య భారత్ కు భారీ కానుక</strong><br />ఈ అండర్ వాటర్ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పూర్తయిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఇతర ఈశాన్య రాష్ట్రాలతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. గత ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రక్షణ మంత్రిత్వ శాఖల ద్వారా 80:20 నిధుల వాటాతో దాదాపు రూ. 14,900 కోట్ల వ్యయంతో ఈ సొరంగం నిర్మాణానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.</p>
<p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/14/8c34fad6cba9bbfd3dfdae332856d0d71771080492411233_original.png" /></p>
<p><span style="color: #e03e2d;"><strong>గౌహ్పూర్ - నుమలిగఢ్ మధ్య ట్విన్ ట్యూబ్ టన్నెల్ హైలైట్స్.. </strong></span><br /><strong>- </strong> 'ఆక్ట్ ఈస్ట్ పాలసీ' కోసం ఈశాన్యాన్ని గేట్‌వేగా అభివృద్ధి చేయడంలో మైలురాయి<br /><strong>- </strong> బ్రహ్మపుత్ర నది కింద టన్నెల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం<br /><strong>- </strong> గౌహ్పూర్ - నుమలిగఢ్ (అస్సాం)ను అనుసంధానం చేస్తుంది<br /><strong>- </strong> 4 లేన్ అండర్‌వాటర్ టన్నెల్<br /><strong>- </strong> టన్నెల్ పొడవు: 15.8 కి.మీ<br /><strong>- </strong> ట్విన్ ట్యూబ్స్: రెండు సమాంతర టన్నెళ్లు రోడ్ + రైల్<br /><strong>- </strong> భారత్‌లో తొలి అండర్‌వాటర్ ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైల్ టన్నెల్</p>
<p><strong>- </strong> జిల్లాలు: గొలాఘాట్, బిస్వనాథ్ (అస్సాం)<br /><strong>- </strong> ప్రాజెక్ట్ పొడవు: 34 కి.మీ<br /><strong>- </strong> మొత్తం ఖర్చు: రూ. 18,662 కోట్లు<br /><strong>- </strong> నిర్మాణ కాలం: 5 సంవత్సరాలు<br /><strong>- </strong> గౌహ్పూర్, నుమలిగఢ్ మధ్య దూరాన్ని 240 కి.మీ నుంచి 34 కి.మీకి తగ్గిస్తుంది<br /><strong>- </strong> ప్రయాణ సమయం 6 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గుతుంది<br /><strong>- </strong> సగటు వేగంలో 100 శాతం పెరుగుదల <br /><strong>- </strong> అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లకు అధిక వేగంతో కనెక్టివిటీ <br /><strong>- </strong> ఈశాన్యంలో పర్యాటకాన్ని పెంచుతుంది<br /><strong>- </strong> సరిహద్దు కనెక్టివిటీ, క్రాస్-బార్డర్ వాణిజ్యం మెరుగవుతుంది<br /><strong>- </strong> ఉపాధి: 80 లక్షల పని రోజులతో కార్మికులకు ఉపాధి</p>