Udayanidhi Stalin: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషపూరితమే- మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

2 months ago 8
ARTICLE AD
<p><strong>Udhayanidhi Stalin comments on Sanatana Dharma are hateful:</strong> మద్రాస్ హైకోర్టు &nbsp;మదురై బెంచ్ జనవరి 20, 2026న సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల విషయంలో అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ వివాదానికి సంబంధించి బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను కొట్టివేస్తూ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. &nbsp;</p> <p>సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు &nbsp;విద్వేషపూరిత ప్రసంగం కిందికే వస్తాయని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> నేత అమిత్ మాలవీయపై నమోదైన ఎఫ్ఐఆర్&zwnj;ను కోర్టు కొట్టివేసింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి 80 శాతం జనాభా అనుసరించే ధర్మాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, ఉదయనిధి వాడిన &nbsp;నిర్మూలన అనే పదం ఒక జాతి లేదా సమూహాన్ని అంతం చేయాలనే &nbsp;నరమేధం వంటి అర్థాన్ని స్ఫురిస్తుందని జస్టిస్ ఎస్. శ్రీమతి తన తీర్పులో పేర్కొన్నారు.</p> <p>ఉదయనిధి స్టాలిన్ ప్రసంగాన్ని లోతుగా విశ్లేషించిన న్యాయస్థానం, &nbsp;అంతం చేయడం &nbsp;లేదా &nbsp;నిర్మూలించడం &nbsp;అనే పదాలు ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఒక వ్యవస్థను పూర్తిగా లేకుండా చేయడాన్ని సూచిస్తాయని అభిప్రాయపడింది. సనాతన ధర్మం అనేది ఒక మతం అయితే, దాని నిర్మూలన పిలుపు &nbsp;మత విధ్వంసం అవుతుందని, అది సంస్కృతిని నాశనం చేయడమే &nbsp;అని కోర్టు వ్యాఖ్యానించింది. ఉదయనిధి ప్రసంగం వల్ల బాధితుడైన ఏ సనాతనీ అయినా దానిని ప్రశ్నించే హక్కు కలిగి ఉంటారని, అమిత్ మాలవీయ చేసిన పోస్ట్ కేవలం ఒక ప్రతిస్పందన మాత్రమేనని కోర్టు సమర్థించింది.</p> <p>భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మం ప్రాముఖ్యతను వివరిస్తూ, మహాత్మా గాంధీ వంటి మహనీయులు కూడా తనను తాను &nbsp;సనాతని హిందువు గా పదేపదే ప్రకటించుకున్నారని కోర్టు గుర్తు చేసింది. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చడం ద్వారా ఒక వర్గం ప్రజల పట్ల విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం జరిగిందని కోర్టు తప్పుపట్టింది. హిందూ ధర్మంపై గత వంద ఏళ్లుగా ద్రావిడ పార్టీలు నిరంతరం దాడులు చేస్తున్నాయని, విద్వేష ప్రసంగాలు ప్రారంభించిన వారిని వదిలేసి, వాటిని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">🚨 BIG BREAKING <br /><br />Madras High Court observed that Udhayanidhi Stalin&rsquo;s 2023 remarks on Sanatana Dharma amounted to HATE speech, noting that calls for its eradication could imply &ldquo;Genocide&rdquo; or &ldquo;Religicide.&rdquo; <a href="https://t.co/Dd3ZuuVQhP">pic.twitter.com/Dd3ZuuVQhP</a></p> &mdash; Megh Updates 🚨&trade; (@MeghUpdates) <a href="https://twitter.com/MeghUpdates/status/2013845684156342627?ref_src=twsrc%5Etfw">January 21, 2026</a></blockquote> <p>ఈ కేసులో అమిత్ మాలవీయపై విచారణను కొనసాగించడం వల్ల ఆయనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని, ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసు అని హైకోర్టు తేల్చి చెప్పింది. మంత్రి ప్రసంగంలోని అంతరార్థాన్ని ప్రశ్నించడం నేరం కాదని, వాస్తవానికి ఆ ప్రసంగమే సెక్షన్ 153A వంటి నిబంధనల కిందకు వస్తుందని పేర్కొంది. &nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/news/did-you-know-these-things-about-bjp-s-new-president-nitin-nabeen-235078" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article