TVK Vijay trouble: కరూర్ తొక్కిసలాట పాపం అంతా విజయ్‌దేనా ? - తమిళనాట కలకలం రేపుతున్న సీబీఐ దూకుడు

3 weeks ago 2
ARTICLE AD
<p><strong>New sensation in the Karur stampede incident: &nbsp;</strong>తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు 'కరూర్ తొక్కిసలాట ఘటన సెంట్రిక్ పాయింట్&zwnj;గా మారింది. నటుడు, తమిళగ వెట్రి కళగం &nbsp;అధినేత విజయ్ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోందని &nbsp;తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. &nbsp;ఈ ఘటనలో విజయ్&zwnj;ను బాధ్యుడిని చేస్తూ సీబీఐ ఛార్జ్&zwnj;షీట్ దాఖలు చేయబోతోందన్న ప్రచారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. &nbsp;</p> <p><strong>విజయ్&zwnj;కు సీబీఐ సెగ - కరూర్ ఘటనలో ఛార్జ్&zwnj;షీట్ భయం?</strong></p> <p>సెప్టెంబర్ 2025లో కరూర్&zwnj;లో జరిగిన టీవీకే బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ, తాజాగా విజయ్ ప్రయాణించిన వాహనం నిర్దేశించిన హద్దులను దాటి జనం మధ్యలోకి వెళ్లడమే ప్రమాదానికి ప్రధాన కారణమని గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులు సూచించిన చోట కాకుండా, కేవలం విజువల్స్, &nbsp;పబ్లిసిటీ కోసం వాహనాన్ని నిబంధనలకు విరుద్ధంగా 20 మీటర్ల ముందుకు తీసుకెళ్లడం వల్లే తోపులాట జరిగిందని &nbsp;లీకులు వస్తున్నాయి. దీనినే ప్రధానాంశంగా తీసుకుని విజయ్&zwnj;పై సీబీఐ ఛార్జ్&zwnj;షీట్ సిద్ధం చేస్తోందన్నది ఇప్పుడు హాట్ టాపిక్.</p> <p><strong>ఢిల్లీలో సుదీర్ఘ విచారణ - ఉత్కంఠ&nbsp;</strong></p> <p>మూడు సార్లు విజయ్ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో వరుసగా విచారణకు హాజరయ్యారు. &nbsp;మార్చి 15న సుమారు 7 గంటల పాటు జరిగిన విచారణలో అధికారులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం. ప్రమాదం జరుగుతున్నట్లు తెలిసినా ప్రసంగాన్ని ఎందుకు ఆపలేదు? జనం స్పృహతప్పి పడిపోతున్నా కాన్వాయ్&zwnj;ను ఎందుకు ముందుకు తీసుకెళ్లారు? వంటి సూటి ప్రశ్నలతో విజయ్&zwnj;ను నిలదీసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసి బయటకు వచ్చినప్పుడు విజయ్ చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేసినప్పటికీ, లోపల జరిగిన విచారణ తీరు మాత్రం ఆయనకు ప్రతికూలంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.</p> <p><strong>రాజకీయ కక్షసాధింపా? వ్యవస్థాగత లోపమా?&nbsp;</strong></p> <p>తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వేళ విజయ్&zwnj;ను ఇరకాటంలో పెట్టడానికే కేంద్ర సంస్థలను వాడుకుంటున్నారని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఒకవేళ ఎన్నికలకు ముందు సీబీఐ ఛార్జ్&zwnj;షీట్ దాఖలు చేస్తే, అది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని &nbsp;రాజకీయ కుట్ర గా అభివర్ణిస్తూనే, విచారణకు సహకరిస్తామని టీవీకే నేతలు చెబుతున్నారు. అయితే, 41 మంది అమాయకుల ప్రాణాలు పోయిన ఘటనలో బాధ్యత ఎవరిదో తేలాల్సిందేనని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.</p> <p><strong>అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం&nbsp;</strong></p> <p>విజయ్ సొంతంగానే పోటీ చేస్తాం అని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ కేసు ఆయనను రక్షణలో పడేసింది. సీబీఐ విచారణ కారణంగా ఆయన ప్రచార షెడ్యూల్ దెబ్బతినడమే కాకుండా, ప్రత్యర్థులకు &nbsp;ఒక బలమైన అస్త్రాన్ని అందించినట్లయింది. ముఖ్యంగా కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని కూడా సీబీఐ విచారణకు పిలవడంతో, ఈ కేసులో మరిన్ని రాజకీయ మలుపులు చోటుచేసుకునేలా ఉన్నాయి.</p> <p><strong>సోషల్ మీడియా ప్రచారాల వెనుక నిజమెంత?&nbsp;</strong></p> <p>తమిళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. కేవలం విజయ్ మాత్రమే కాకుండా, సభ నిర్వహణలో విఫలమైన ఆయన సన్నిహిత వర్గంపై కూడా చర్యలు ఉండబోతున్నాయని ప్రచారం సాగుతోంది. సీబీఐ తన &nbsp;స్టేటస్ రిపోర్ట్ ను త్వరలోనే సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో, ఈ నెలాఖరులోపు ఛార్జ్&zwnj;షీట్ రూపంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కరూర్ ఘటన విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఒక పెద్ద సవాల్&zwnj;గా మారింది.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/auto/how-to-renew-your-driving-license-241367" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article