Today Top Headlines: జగన్‌కు టైం వచ్చిందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ లాంటి కీలక అప్‌డేట్‌ ఇక్కడ చూడండి

10 months ago 8
ARTICLE AD
<p>టైగర్&zwnj;కు టైం వచ్చిందా?</p> <p>ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టైం వచ్చిందని వైసీపీ కేడర్ అంటోంది. కూటమి సర్కారు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమైనట్టు చెప్పుకుంటున్నారు. ఈ ఫిబ్రవరి నుంచి <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> 2.0ను చూస్తారని అంటున్నారు. జిల్లా పర్యటనలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారట. ఇప్పటికే కీలక నేతలంతా పార్టీని వీడుతున్న టైంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న వైసీపీ కేడర్&zwnj;లో ఉత్తేజం నింపేందుకు జనంలోకి వస్తారని ప్రచారం చేస్తున్నారు. కూటమి గవర్నమెంట్&zwnj;కు హనీమూన్&zwnj; పిరియడ్ పూర్తి అయిందని ఇక దబిడిదిబిడే అంటున్నారు వైసీపీ నేతలు. <a title="మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్&zwnj; చేయండి." href="https://telugu.abplive.com/andhra-pradesh/ysrcp-chief-ys-jagan-comeback-to-ap-politics-in-february-after-returns-from-london-tour-196174" target="_blank" rel="noopener"><strong>మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్&zwnj; చేయండి.</strong></a></p> <p><strong>సుప్రీంకోర్టు అసహనం&nbsp;</strong></p> <p>పార్టీ మారిన పది మంది బీఆర్&zwnj;ఎస్&zwnj; ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో తాత్సారం చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన సమయం అంటే ఎంత అంటూ ప్రశ్నించింది. మహారాష్ట్రలో చేసినట్టు శాసనసభ గడువు ముగిసే వరకా అని నిలదీసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు నిపించే న్యాయవాది ముకుల్ రోహత్గీపై ప్రశ్నల వర్షం కురిపించింది. స్పీకర్&zwnj;తో చర్చించి గడువుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టుకు ఆయన వివరించారు. <strong><a title="మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్&zwnj; చేయండి." href="https://telugu.abplive.com/telangana/supreme-court-asked-telangana-assembly-secretary-when-he-would-take-a-decision-on-the-defections-196180" target="_blank" rel="noopener">మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్&zwnj; చేయండి.</a></strong></p> <p><strong>లైట్&zwnj; తీసుకోవద్దు</strong></p> <p>రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్ తీసుకోవాలని కూటమి నేతలకు అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సూచించారు. అభ్యర్థుల విజయానికి ఎన్డీయే పక్షాలు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని హితవు పలికారు. ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్&zwnj;లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్ధేశం చేశారు. ఏ ఎన్నికలొచ్చినా సుస్థిర పాలన ఉంటుందని హామీ ఇచ్చారాయన. కొత్తగా గెలిచిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> సూచించారు. ఓవర్ కాన్ఫిడెన్స్&zwnj;లో తప్పులు చేయొద్దని హెచ్చరించారు.&nbsp;<a title="మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్&zwnj; చేయండి." href="https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/work-with-integrity-focus-on-mlc-elections-chandrababu-teleconference-with-tdp-leaders-196175" target="_blank" rel="noopener">మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్&zwnj; చేయండి.</a></p> <p><strong>ఉస్మానియాకు కొత్త భవనం&nbsp;</strong></p> <p>ఉస్మానియా ఆసుపత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి తెలంగాణ సీఎం <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియం వద్ద కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ భవనానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్&zwnj; రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి భూమిపూజ చేశారు. ఉదయం 11.55 గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సైతం కార్యక్రమానికి హాజరయ్యారు.&nbsp; <a title="మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్&zwnj; చేయండి." href="https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-cm-revanth-reddy-lay-foundation-stone-for-osmania-hospital-at-goshamahal-stadium-hyderabad-196170" target="_blank" rel="noopener">మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్&zwnj; చేయండి.</a></p> <p><strong>ఎస్&zwnj;ఐ ఆత్మహత్య</strong>&nbsp;</p> <p>సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లాల్సిన ఎస్&zwnj;ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా తణుకులో జరిగిందీ ఘటన. ఉదయం స్టేషన్&zwnj;కు వచ్చిన ఎస్సై మూర్తి సూసైడ్&zwnj; చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2012 బ్యాచ్&zwnj;కు చెందిన ఈయనపై ఇటీవలే &nbsp;అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీఆర్&zwnj;లో ఉన్న ఆయనకు సీఎం బందోబస్తు డ్యూటీ వేశారు. దీని కోసం వచ్చి సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. <a title="మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్&zwnj; చేయండి." href="https://telugu.abplive.com/crime/tanuku-si-dies-by-suicide-using-gun-at-police-station-196155" target="_blank" rel="noopener">మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్&zwnj; చేయండి.</a></p>
Read Entire Article