Tirumala News: శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !

9 months ago 9
ARTICLE AD
<p><strong>Tirumala adulterated ghee case update:</strong> దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి నెయ్యి ప్రసాద కల్తీ కేసులో సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టులు ప్రారంభించింది. కల్తీ &nbsp;నెయ్యి సరఫరా చేసిన నలుగురు సరఫరాదారుల్ని అరెస్టు చేసింది. వారిని జైలుకు పంపింది. వారి నుంచి సూత్రధారుల వివరాలను రాబట్టేందుకు పది రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. మరో వైపు ఇప్పటికే దర్యాప్తులో లభించిన సమాచారాన్ని బట్టి పలువురికి నోటీసులు జారీ చేస్తున్నారు. సీబీఐ సిట్ అరెస్టులు ప్రారంభించడంతో కొంత మంది ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>తిరుమల ప్రసాదాలకు సరిపడే నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేకపోయినా తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి చాలా తక్కువకు కాంట్రాక్ట్&zwnj;కు ఇచ్చారు. ఆ సంస్థ వేల కోట్ల దూరం అవతర ఉన్న భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యిని ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. దాన్ని వైష్ణవీ డైరీ పేరుతో సరఫరా చేశారు. ఈ మధ్యలోనే నెయ్యి కల్తీ చేసి తిరుమలకు తరలించినట్లుగా భావిస్తున్నారు. అయితే వీళ్లందరూ కల్తీ చేసిన వాళ్లే.. అసలు కల్తీ చేయమని చెప్పింది ఎవరు అన్నదానిపై సిబిఐ సిట్ దర్యాప్తు ప్రారంభిచింది. అంతిమంగా కల్తీ నెయ్యి ద్వారా అక్రమంగా లబ్ది పొందింది ఎవరు అన్నది తేల్చబోతున్నారు. ఇందు కోసం పలువురుకు నోటీసులు జారీ చేస్తున్నారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p>తిరుమలలో అత్యంత కీలక పొజిషన్లలో ఉన్న వారి జోక్యం లేకపోతే.. <a title="కర్ణాటక" href="https://telugu.abplive.com/topic/Karnataka" data-type="interlinkingkeywords">కర్ణాటక</a>లోని ప్రభుత్వ డెయిరీ నందినిని కాదని.. ఏ మాత్రం సామర్థ్యం లేని కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. అప్పటి పాలక మండలి, అధికారుల ప్రమేయంతోనే నెయ్యి టెండర్లు ఇచ్చారన్న అనుమానాలతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి కూడా సీబీఐ సిట్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. విచారణకు సహకిరంచకపోతే అరెస్టులకు కూడా వెనుకాడేది లేదని ఇప్పటికే సీబీఐ సిట్ చేతల ద్వారా సంకేతాలు పంపడంతో.. ఈ వ్యవహారంలో పేరు ఉందని భావిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p>తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును కూడా వాడారని <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ కొంత మంది సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబీఐ సిట్ ను నియమించారు. ఏపీ పోలీసులు ఇద్దరు, సీబీఐకి చెందిన ఇద్దరు..మరో ఫుడ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ప్రతినిధితో సిట్ ఏర్పాటయింది. సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణ ఈ దర్యాప్తు కమిటీపై ఉంటుంది.&nbsp;</p> <div id="article-hstick-inner" class="abp-story-detail "> <p>Also Read:&nbsp;<a href="https://telugu.abplive.com/telangana/hyderabad/chilukur-balaji-temple-priest-attacked-accused-arrested-197337" target="_blank" rel="noopener">Chilukur Temple: చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్&zwnj;పై దుండగుల దాడి కేసు, నిందితుల అరెస్ట్</a></p> </div> <div class="article-footer"> <div class="article-footer-left ">&nbsp;</div> </div>
Read Entire Article