Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు

11 months ago 7
ARTICLE AD
<p>కోల్&zwnj;కతా: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఓ పెద్దపులి కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల ప్రజలను హడలెత్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఏదో చోట పులి సంచారం, కొన్ని చోట్ల జంతువులపై, మనుషులపై దాడులు చేయడం కలకలం రేపింది. అలాంటి మరో ఘటన జరిగింది. ఒడిశాలోని టైగర్&zwnj; రిజర్వ్&zwnj; నుంచి తప్పించుకున్న ఆడ పులి ఏకంగా మూడు రాష్ట్రాల అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. చివరికి పశ్చిమ బెంగాల్&zwnj;లో పులి చిక్కడంతో ఊపరి పీల్చుకున్నారు. &nbsp;21 రోజుల్లో 3 రాష్ట్రాల్లో 300 కిలోమీటర్లపైగా ప్రయాణించిన పులి సమస్యకు చెక్ పెట్టారు.&nbsp;</p> <p><strong>మహారాష్ట్ర నుంచి ఒడిశాకు తరలింపు</strong></p> <p>అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని తడోబా- అంధారి టైగర్ రిజర్వ్ నుంచి ఓ ఆడ పులిని ఇటీవల ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్&zwnj;కు తరలించారు. జీనత్ అనే ఆడపులి వయసు మూడేళ్లు. ఈ క్రమంలో సిమ్లీపాల్&zwnj; టైగర్&zwnj; రిజర్వ్&zwnj; నుంచి డిసెంబరు 8న ఆడ పులి తప్పించుకుంది. దాంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఆడపులి కొన్ని రోజులు మహారాష్ట్రలోనే సంచరించినా తరువాత ఝార్ఖండ్&zwnj;లోకి ప్రవేశించింది. ఝార్ఖండ్ ప్రజలతో పాటు అటవీశాఖ అధికారులను వారం రోజులపాటు హడలెత్తించింది. పులి పాదముద్రలు గుర్తించేలోపే మకాం మార్చేసేది. దాంతో పులి జాడ కనిపెట్టడం కష్టతరంగా మారడంతో పట్టుకోలేకపోయారు.</p> <p>వారం రోజులపాటు ఝార్ఖండ్&zwnj;లో సంచరించిన పులి మరో వంద కిలోమీటర్లు పైగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్&zwnj;లోకి ప్రవేశించింది. మొదట ఝార్&zwnj;గ్రామ్&zwnj;లో స్థానికుల్ని హడలెత్తించిన పులి చివరగా అటవీశాఖ అధికారులకు దొరికింది. బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో మత్తు మందు ఇచ్చి అటవీశాఖ అధికారులు పులిని బంధించారు. ఆదివారం నాడు అధికారుల ప్రయత్నం ఫలించింది. మూడు వారాల్లో మూడు రాష్ట్రాల్లో కలకలం రేపిన పులిని బంధించారన్న సమాచారం తెలియడంతో పశ్చిమ బెంగాల్&zwnj; ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులను అంకితభావానికి ఇది నిదర్శనం అన్నారు. పులిని బంధించి, ప్రజలను రక్షించిన ఈ ఆపరేషన్&zwnj;లో భాగమైన అందరికీ మమత అభినందనలు తెలిపారు.</p>
Read Entire Article