Thurakapalem Deaths Mystery: తురకపాలెంay మరణాలపై వీడిన మిస్టరీ- యురేనియం అవశేషాలు గుర్తింపు, చెన్నైలో నిర్ధారణ

2 months ago 3
ARTICLE AD
<p>Dangerous Uranium found in Thurakapalem | అమరావతి: గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావడానికి, అసాధారణ మరణాలకు ప్రధాన కారణం అక్కడి నీటిలో ఉన్న యురేనియం అవశేషాలు ఉన్నట్టు అధికారులు నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన కోసం గ్రామంలోని త్రాగు నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై, ఎయిమ్స్&zwnj;, గుంటూరు జీజీహెచ్&zwnj; ల్యాబ్&zwnj;లకు పంపించారు. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం(NCDC) ఆధ్వర్యంలోని వైద్య నిపుణులు గుంటూరు శివారులోని తురకపాలెంను మంగళవారం (సెప్టెంబర్ 9న) సందర్శించారు. అసాధారణ మరణాలకు కారణాలపై ఎన్&zwnj;సీడీసీ సంయుక్త సంచాలకురాలు డాక్టర్&zwnj; హేమలత, నోడల్&zwnj; అధికారి ప్రవీణ్&zwnj;కుమార్&zwnj; ఆధ్వర్యంలోని బృందం గ్రామంలో సమీక్షించింది. గ్రామస్తులను అడిగి పరిస్థితి తెలుసుకుని, కొన్ని వివరాలు సేకరించారు.</p> <p>చెన్నైలో పరీక్షించిన నీటి నమూనాల ఫలితాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. అందులో తురకపాలెం పరిసరాల నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్టు తేలింది. ఈ ప్రాంతంలో రాళ్ల క్వారీలు విస్తారంగా ఉండటం, వాటిలోనే స్థానికులు పని చేయడం, అలాగే ఆ క్వారీ గుంతలలోని నీటిని వినియోగించడమే ఈ సమస్యకు కారణమయ్యుండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, నీటిలో స్ట్రాన్షియం అనే హానికర మూలకం మరియు ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు చెన్నై నివేదికలో తేలింది. అయితే, మొదటిసారిగా నిర్వహించిన పరీక్షల్లో మాత్రం బ్యాక్టీరియా కేవలం ఒకేచోటే ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై చెన్నై నివేదిక ఫలితాలు కొంత భిన్నంగా వచ్చాయని అధికారులు తెలిపారు.</p> <p><strong>యురేనియం ప్రభావంపై వైద్యుల హెచ్చరిక</strong><br />యురేనియం మానవ శరీరానికి ఎంతో ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది తాగునీరు లేదా ఆహార మార్గంలో శరీరంలోకి ప్రవేశిస్తే మొదటగా మూత్రపిండాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. అనంతరం చర్మ సమస్యలు, కాలేయం, &nbsp;మెదడు, ఊపిరితిత్తులు, ఎముకలకు దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.</p> <p><br /><strong>తురకపాలెం &ndash; గుంటూరు జీజీహెచ్&zwnj; నివేదిక వివరాలు:</strong><br />తురకపాలెం గ్రామం నుంచి గుంటూరు జీజీహెచ్&zwnj; వైద్య కళాశాలలకు పంపిన 91 రక్త నమూనాల్లో ఒకటి బ్లడ్ కల్చర్ పరీక్షలో పాజిటివ్&zwnj;గా తేలింది. 64 నమూనాలు నెగెటివ్&zwnj;గా నిర్ధారించారు. వైద్యాశాఖ అధికారుల ప్రకారం, మెలియాయిడోసిస్&zwnj; అనే వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా కాకపోయినా, ఇతర సూక్ష్మజీవుల ఆనవాళ్లు లభించాయి. అందులో 11 నమూనాల్లో కోకై గ్రామ్ పాజిటివ్&zwnj; బాక్టీరియా, 1 నమూనాలో ఎంఆర్&zwnj;ఎస్&zwnj;ఏ (MRSA), 4 నమూనాల్లో ఎంఎస్&zwnj;ఎస్&zwnj;ఏ (MSSA) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో చెన్నై ప్రయోగశాలకు పంపిన నమూనాల తాజా ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. యురేనియం అవశేషాలు ఉన్నాయని ఆ రిపోర్టులో వెల్లడైంది.</p>
Read Entire Article