Thalliki Vandanam Scheme: ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులెన్ని?

9 months ago 7
ARTICLE AD
<p>Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్&zwnj;లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించిన వాటిలో సూపర్&zwnj; సిక్స్&zwnj; హామీలు ఒకటి. అందుకే దీనిపై ఈ బడ్జెట్&zwnj;లో ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ సూపర్&zwnj; సిక్స్ హామీల్లో ముఖ్యమైంది తల్లికి వందన పథకం. గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి మార్పులు చేర్పులు చేసి దీన్ని అమలు చేయనున్నారు. స్కూల్&zwnj;కు వెళ్లే విద్యార్థులకు ఈ పథకాన్ని అందించనున్నారు. మే నెలలో తొలి విడత నిధులు మంజూరు చేయనున్నారు.&nbsp;</p> <p>విద్యకు కేటాయింపులు పయ్యావుల మాటల్లోనే"గత ప్రభుత్వపు దుర్మార్గపు పాలనా కాలంలో రాష్ట్ర విద్యావ్యవస్థపై దృష్టి సారించకపోవడం, నిర్లక్ష్యం, తప్పుడు విధానాలు వలన, మన రాష్ట్రంలోని 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానివేయటంతో వారి భవిష్యత్ ప్రమాదంలో పడింది.. &nbsp;</p> <p>ఇలాంటి పరిస్థితులలో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ తనపై వేసుకున్నారు.. 'నేటి బాలలే.. రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు. రిజల్ట్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీవడి రాణించడానికి సిద్ధమవుతున్నారు.&nbsp;</p> <p>"మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే, వరి నాటండి.. దశాబ్దానికి ప్రణాళిక వేస్తే, చెట్లు నాటండి.. జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే, ప్రజలకు విద్యనేర్పండి అన్న చైనా సామెతను ప్రాతిపదికగా పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతనూ ఏ బిడ్డా విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాము. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు వంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో, మరో సూపర్ సిక్స్ హామీని అమలు వరిచే దిశగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం క్రింద 15,000 రూపాయల ఆర్థిక సహాయంను అందించనున్నాము. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ వథకాన్ని అందించడానికి కేటాయింవులు జరువుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది.&nbsp;</p> <p>సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వుస్తకాలు, యూనిఫాంలు.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం.&nbsp;</p> <p>ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంతో కూడిన విద్యా వ్యవస్థ కోసం మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించింది. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమేగాక ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్ల రూపాయల కేటాయింవును ప్రతిపాదిస్తున్నాను.&nbsp;</p> <p><strong>ఉన్నత విద్య&nbsp;</strong><br />భవిష్యత్ నవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడం, అందరికీ సమాన అవకాశాలను కల్పించడం కోసం బలమైన, నమ్మిళిత ఉన్నత విద్యావ్యవస్థ నిర్మించడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉంది. ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య, వరిశోధన విశ్వ విద్యాలయాల స్థావన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాలలో మన రాష్ట్ర విశ్వ విద్యాలయాలను నిలవడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. అందుకే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్ల రూపాయల కేటాయింవును ప్రతిపాదిస్తున్నాను అని పయ్యావుల తెలిపారు.&nbsp;</p>
Read Entire Article