Telangana MLC elections 2025: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఉత్తర తెలంగాణలో ఫిబ్రవరి 27న కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి3న ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.