TG EAPCET 2025: తెలంగాణ ఎప్‌సెట్-2025 నోటిఫికేషన్ వచ్చేస్తోంది, ఆ కోటా సీట్లన్నీ రాష్ట్రవిద్యార్థులకే

9 months ago 7
ARTICLE AD
<p style="text-align: justify;"><span style="color: #ba372a;">TG EAPCET 2025 Notification:</span> తెలంగాణలో ఇంజినీరింగ్&zwnj; కళాశాలలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్&zwnj;, అగ్రికల్చర్&zwnj;, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్&zwnj; 2025 (EAPCET) నోటిఫికేషన్&zwnj; నేడు (ఫిబ్రవరి 20న) విడుదల కానుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎప్&zwnj;సెట్ పూర్తిస్థాయి నోటిఫికేషన్&zwnj;ను అధికారిక వెబ్&zwnj;సైట్&zwnj;లో అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 25 నుంచి ఆన్&zwnj;లైన్&zwnj; దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు; మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది కూడా ఈఏపీసెట్&zwnj;ను జేఎన్టీయూ నిర్వహించనుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్&zwnj;లోని కర్నూల్&zwnj;, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>నాన్&zwnj; లోకల్&zwnj; కోటా రద్దు..</strong><br />రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న 15 శాతం అన్&zwnj;రిజర్వుడ్(నాన్ లోకల్) కోటా రద్దు కానుంది. కన్వీనర్&zwnj; కోటా సీట్లన్నీ ఇకపై తెలంగాణ విద్యార్థులకే కేటాయించనున్నారు. ఇంజినీరింగ్&zwnj; సీట్లను 70 శాతం కన్వీనర్&zwnj; కోటాలో, 30 శాతం మేనేజ్&zwnj;మెంట్&zwnj; కోటాలో భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కన్వీనర్&zwnj; కోటాలోని 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేవారు. అయితే ఉమ్మడి రాజధాని, రాష్ట్ర విభజన పదేళ్ల గడువు గతేడాదితో పూర్తవడంతో.. నాన్&zwnj;లోకల్&zwnj; కోటా గడువు కూడా ముగిసినట్లయింది. ఈ నేపథ్యంలో కన్వీనర్&zwnj; కోటాలోని పూర్తి సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే దక్కనున్నాయి.</p> <p style="text-align: justify;"><strong>క్లారిటీ లేకుండానే నోటిఫికేషన్..</strong><br />నాన్&zwnj;లోకల్&zwnj; కేటగిరీ ప్రవేశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో కొన్ని షరతులకు లోబడి నోటిఫికేషన్&zwnj; జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం జారీ చేయబోయే ఉత్తర్వుల మేరకే నాన్&zwnj;లోకల్&zwnj; కేటగిరీ ప్రవేశాలుంటాయని నోటిఫికేషన్&zwnj;లో పేర్కొనే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలోని కళాశాల్లో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలపైనా గందరగోళ స్థితి ఏర్పడింది. గతేడాది వరకు ఈ కోర్సులో ప్రవేశాలను ఎప్&zwnj;సెట్&zwnj; ర్యాంకుల ఆధారంగా చేపట్టగా.. ఈ ఏడాది అటవీశాఖే స్వయంగా ప్రవేశపరీక్ష నిర్వహించాలని భావించింది. అయితే ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఎప్&zwnj;సెట్&zwnj;లో బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాల అంశాన్ని ప్రస్తావిస్తారా, లేదా అనే దానిపైనా అయోమయం నెలకొంది.</p> <p style="text-align: justify;">రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున స్థానికత, స్థానికేతర కోటా తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గతేడాది డిసెంబరులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని, అందులో 95 శాతం రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5 శాతం వివిధ అవసరాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఇవ్వాలని ప్రధానంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. దీనిపై కమిటీ ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని వివరణ కోరగా.. నివేదిక అందజేశామని, 95-5 కోటాపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్పారు. తుది నిర్ణయం వెలువడనందున ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయనే నిబంధన విధించి ఎప్&zwnj;సెట్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>మరిన్ని సీట్లు అందుబాటులోకి..</strong><br />కమిటీ సిఫారసును ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్ర విద్యార్థులకు మరిన్ని ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు 15 శాతం అన్&zwnj;రిజర్వుడ్ కోటాలో మొత్తం 12 వేల సీట్లు ఉండగా.. అందులో 4-5 వేల సీట్లు మెరిట్ ఆధారంగా ఏపీ విద్యార్థులు పొందుతున్నారు.&nbsp;</p> <p style="text-align: center;"><strong><a title="మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.." href="https://telugu.abplive.com/education" target="_blank" rel="nofollow nofollow noopener">మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..</a></strong></p>
Read Entire Article