Telangana Panchayat Elections: మరోసారి ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ - పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ ఎస్‌ఈసీ సన్నాహాలు

2 weeks ago 2
ARTICLE AD
<p><strong>Telangana Voter list revised : &nbsp;</strong>తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. &nbsp;రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) గ్రామీణ ప్రాంతాల్లో &nbsp;ఓటర్ల &nbsp;జాబితాల సవరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఈ కార్యాచరణ నవంబర్ 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు జరిగేలా షెడ్యూల్&zwnj;ను విడుదల చేసింది. ఈలోపుల ఓటర్ల &nbsp; జాబితాల్లో లోపాలను సరిచేసి, కొత్త ఓటర్లను చేర్చి .. &nbsp;పారదర్శకమైన ఓటర్ల జాబితాను రెడీ &nbsp;చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఈ ప్రకటనతో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ &nbsp;రెండో వారంలో &nbsp;నిర్వహించడానికి ప్రక్రియ ప్రారంభించినట్లయింది.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p><strong>కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఓటర్ల జాబితా సవరణ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</strong></p> <p>TSEC ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ నవంబర్ 20న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలు, &nbsp;తప్పులు సరిదిద్దడం వంటివి చేస్తారు. &nbsp;ఇరవయ్యో తేదీన ఓటర్లు తమ గ్రామ పంచాయతీ కార్యాలయాలు, బూత్&zwnj; లెవల్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటర్లు 18 ఏళ్లు పూర్తి చేసినవారు, పేరు తప్పులు, అడ్రస్ మార్పులు, మరణించినవారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై దరఖాస్తులు చేసుకోవచ్చు. ఓటర్ల జాబితా &nbsp; అభ్యంతరాలు పరిష్కరణ ఇరవై రెండోతేదీన ఉంటుంది. ఈ రోజు బూత్&zwnj;లెవల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అర్హత తనిఖీలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ దశలో జరుగుతాయి.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p><strong>నవంబర్ 23న తుది ఓటర్ల జాబితా సవరణ&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>నవంబర్ 23న చివరి ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ స్టేషన్లు ధృవీకరణ ఉంటుంది. &nbsp;సవరించిన ఓటర్ల జాబితాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. &nbsp;ఈ ప్రక్రియలో ఓటర్లు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్&zwnj;బుక్ వంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. ఆన్&zwnj;లైన్&zwnj;లో కూడా (tsvs.eci.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చు. TSEC అధికారులు, "ఈ సవరణ ద్వారా 18-19 ఏళ్ల యువతను, మహిళలను మావట జాబితాల్లో చేర్చి, ఎన్నికల పారదర్శకతను పెంచుతాము" అని తెలిపారు. ఈ కార్యాచరణ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో జరుగుతుంది.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p><strong>మూడు దశల్లో 12వేలకుపైగా పంచాయతీల్లో నెలలో పూర్తి&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong><br />&nbsp;<br />సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. &nbsp;ప్రతి దశ మధ్య గరిష్టంగా ఐదు రోజుల వ్యవధి ఉంటుంది. ఈ మేరకు, డిసెంబర్ &nbsp;రెండో వారం నుంచి నెలలో &nbsp;మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. &nbsp; ఎన్నికలు పార్టీ సింబుల్స్ లేకుండా (నాన్-పాలిటికల్) జరుగుతాయి, కానీ పార్టీలు తమ మద్దతును అభ్యర్థులకు అందించవచ్చు. <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పార్టీ ఇప్పటికే &nbsp;42 శాతం బీసీ కోటాను అమలు చేస్తామని ప్రకటించింది.<br />&nbsp; &nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/spirituality/here-are-some-unbelievable-facts-about-sathya-sai-baba-227796" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article