Telangana Panchayat Election Results: పంచాయ‌తీ ఎన్నికల ఫలితాలపై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు

3 months ago 7
ARTICLE AD
<p>Telangana Panchayat Election Results | కొల్లాపూర్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార&zwnj;ధ్యంలోని ప్ర&zwnj;జా ప్ర&zwnj;భుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిల&zwnj;బెట్టుకున్నామ&zwnj;ని రాష్ట్ర ప&zwnj;ర్యాట&zwnj;క&zwnj;, సాంస్కృతిక శాఖ మంత్రి జూప&zwnj;ల్లి కృష్ణారావు అన్నారు. పంచాయ&zwnj;తీ ఎన్నిక&zwnj;ల ఫ&zwnj;లితాల&zwnj;పై చిన్నంబావిలో మంత్రి జూప&zwnj;ల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. గ&zwnj;త బీఆర్ఎస్ ప్ర&zwnj;భుత్వం నిర్వాకం వ&zwnj;ల్ల&zwnj; ఆర్థిక వ్య&zwnj;వ&zwnj;స్థ చిన్న&zwnj;భిన్న&zwnj;మైంద&zwnj;ని, ధనిక రాష్ట్రం అప్పుల కుప్ప&zwnj;గా మారింద&zwnj;ని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్ర&zwnj;జ&zwnj;ల సంతోష&zwnj;మే ల&zwnj;క్ష్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల&zwnj;ను ఒక్కొక్కటిగా అమ&zwnj;లు చేస్తున్నామ&zwnj;ని తెలిపారు. మిగిలిన హామీల్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలోనే అమలు చేస్తుందన్నారు. చాలాచోట్ల ఇంకా పనులు మొదలుపెట్టాల్సి ఉందన్నారు. అయితే సీఎం <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> నాయకత్వ పటిమ, సమర్థతతో పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లో గట్టి నమ్మకం, విశ్వాసం ఏర్పడింద&zwnj;నడానికి ఈ పంచాయ&zwnj;తీ ఎన్నిక&zwnj;ల ఫ&zwnj;లితాలే నిద&zwnj;ర్శ&zwnj;మ&zwnj;ని జూపల్లి పేర్కొన్నారు.&nbsp;</p> <p><strong>50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం</strong></p> <p>కొల్లాపూర్ నియోజ&zwnj;క&zwnj;వ&zwnj;ర్గంలో జరిగిన మొద&zwnj;టి, రెండ&zwnj;వ విడ&zwnj;త &nbsp;గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిల&zwnj;బెట్టుకుంద&zwnj;ని మంత్రి జూప&zwnj;ల్లి కృష్ణారావు అన్నారు. నియోజ&zwnj;క&zwnj;వ&zwnj;ర్గంలో 50 చోట్ల (3 స్వ&zwnj;తంత్రుల&zwnj;ను క&zwnj;లిపి) అధికార కాంగ్రెస్ &nbsp;పార్టీ మద్దతుదారులు గెలవగా, 28 స్థానాల్లో <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a>, బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు. రెండు సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చుతున్నాయని, కొన్ని పనులు ఇంకా ప్రారంభదశలో ఉన్నాయని తెలిపారు.</p> <p><strong>త్వరలోనే చిన్నంబావి పనులు చేపడతాం..</strong></p> <p>&nbsp;చిన్నంబావికి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశాం. పనులకు టెండర్లు ఆహ్వానించాం. ఆర్ అండ్ బీకి రూ.200 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.100 కోట్లతో పనులు చేపడుతున్నాం. వాటి నుంచి చిన్నంబావి మండలం అభివృద్ధి పనులకు కేటాయించాం. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు మేం మద్దతు తెలిపిన అభ్యర్థులు మూడింట రెండు వంతులు గెలుపొందుతూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.</p>
Read Entire Article