Telangana Municipal Elections 2026: నివాసం నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

2 months ago 8
ARTICLE AD
<p data-path-to-node="9">మంచిర్యాల: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 227వ నంబర్ పోలింగ్ బూత్&zwnj;లో ఓటు వేసేందుకు మంత్రి తన నివాసం నుంచి సాధారణ పౌరుడిలా నడుచుకుంటూ వెళ్లడం విశేషం.&nbsp;</p> <p data-path-to-node="9">ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 85 శాతం స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం సాగుతోందని, అందుకే మున్సిపల్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, ఎలాంటి ఒత్తిడి లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.<br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/11/3b686b2e7268da52dd2ffcccabbe74bf1770777704857233_original.jpeg" /></p> <p data-path-to-node="9"><strong>బీఆర్ఎస్ హయాంలో భయపెట్టి ఏకగ్రీవాలు..&nbsp;</strong></p> <p data-path-to-node="10">గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. బీఆర్ఎస్ హయాంలో పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని హరించి ఏకగ్రీవాలు చేయించుకున్న ఘటనలు ఉన్నాయని మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఆరోపించారు.&nbsp;</p> <p data-path-to-node="9"><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/11/50e2531990a0f077a353f5433ab968331770777731755233_original.jpeg" /></p> <p data-path-to-node="10">కానీ ఇప్పుడు ఎక్కడా పోలీసుల ఒత్తిడి లేదని, ప్రజలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ, ముఖ్యమంత్రి <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోందని వివరించారు.</p> <p data-path-to-node="10"><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/11/0cf5a00e2643f83ecfb9a6b5b9a251c51770777840117233_original.jpeg" /></p> <p data-path-to-node="11">కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజారంజక పథకాల పట్ల ప్రజలంతా పూర్తి సంతృప్తితో ఉన్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 85 శాతానికి పైగా స్థానాల్లో <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. చివరగా, స్థానిక సంస్థల బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.</p>
Read Entire Article