Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

1 month ago 6
ARTICLE AD
<p><strong>Telangana Latest News:&nbsp;</strong>తెలంగాణలో పాలనా యంత్రాంగాన్ని మరింత చైతన్యవంతం చేస్తూ, ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఒక సమగ్రమైన రోడ్ మ్యాప్&zwnj;ను ఆవిష్కరించారు. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచుల నుంచి మేయర్ల వరకు ప్రతి ప్రజాప్రతినిధిని భాగస్వాములను చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేవలం &nbsp;అధికార యంత్రాంగమే కాకుండా, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైనప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం జిల్లా కేంద్రాల్లో ప్రజాప్రతినిధులకు వారి విధులు, బాధ్యతలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, అవసరమైన సమాచారాన్ని ప్రింటెడ్ మెటీరియల్ రూపంలో అందజేయనున్నారు.&nbsp;</p> <h3>సంక్షేమ పథకాల్లో పారదర్శకత- సాంకేతికతతో అక్రమాలకు చెక్&nbsp;</h3> <p>ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే అందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ప్రతి పథకంలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆసరా పింఛన్లలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆసరా పింఛన్లలో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా సుమారు 3 లక్షల మంది అనర్హులను తొలగించింది ప్రభుత్వం. సాంకేతికతను సక్రమంగా వినియోగించుకపోవడం వల్ల గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ, అర్హులైన ప్రతి పేదవాడికి న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.&nbsp;</p> <p>గ్రామ, వార్డు సభల్లో నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణ మాఫీ వంటి పథకాల లబ్ధిదారుల వివరాలను బహిరంగంగా వెల్లడించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు కలుగుతున్న లబ్ధిని &nbsp;లెక్కలతో సహా వివరించడం ద్వారా పాలనలో జవాబుదారితనం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.&nbsp;</p> <p>సంప్రదాయం నుంచి ఆధునికతవైపు తెలంగాణ అన్నదాతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా సోలార్&zwnj; విద్యుత్&zwnj; వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయ పంప్&zwnj;సెట్&zwnj;ల స్థానంలో సోలార్&zwnj; పంప్ సెట్&zwnj;ు వాడటం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని, ఇళ్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని గ్రిడ్&zwnj;కు అనుసంధానం చేయడం ద్వారా ఆదాయం పొందే మార్గాలపై అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖకు సూచించారు.&nbsp;</p> <p>వ్యవసాయం శాఖ కేవలం విత్తనాలు, ఎరువులు పంపిణీకే పరిమితం కాకుండా శాస్త్రీయ దృక్పథంతో పని చేయాలని సకాలంలో రైతులకు అందించే, ఏ నేలలో ఏ పంట వేస్తే లాభదాయకమో సూచించాలని ఆదేశించారు. యూరియా యాప్&zwnj;లో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించి, నానో యూరియా వినియోగాన్ని క్షేత్రస్థాయి ప్రదర్శనల ద్వారా రైతులకు చేరువ చేయాలని నిర్ణయించారు.&nbsp;</p> <p>నాణ్యమైన సేవల దిశగా రాష్ట్రంలోని ప్రభుత్వం వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థానిక పీహెచ్&zwnj;సీలు, సీహెచ్&zwnj;సీలతో అనుసంధానం చేయనున్నారు. మెడికల్&zwnj; కాలేజీల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన వైద్యులు, ప్రొఫెసర్ల సేవలు సామాన్య ప్రజలకు కూడా అందేలా రిఫరల్&zwnj; విధానాన్ని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు.&nbsp;</p> <p>విద్యా రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్&zwnj;, ఈ-సిగరెట్ల వినియోగాన్ని అరికట్టే బాధ్యతను విద్యాసంస్థల యాజమాన్యాలకే అప్పగించారు. విద్యార్థుల మానసిక స్థితిని గమనిస్తూ వారికి సరైన మార్గదర్శనం చేసేందుకు ప్రతి ప్రైవేటు, కార్పొరేట్&zwnj; విద్యాసంస్థలో సైకాలజిస్ట్&zwnj;లను నియమించడం తప్పనిసరి చేయనున్నారు. మరోవైపు మధ్యాహ్నం భోజన పథంలో ఎక్కడా అంతరాయం కలగకుండా ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని, విద్యార్థులకు పోషకాహారం అందేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.&nbsp;</p> <p>ప్రజాభద్రత, మౌలిక సదుపాయాలు రహదారి భద్రతకు పెద్దపీట వేస్తూ, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారులపై గుంతలు, ప్రమాదకర ప్రాంతాల సమాచారం పంపేందుకు ఒక ప్రత్యేక <a title="వాట్సాప్" href="https://telugu.abplive.com/topic/whatsapp" data-type="interlinkingkeywords">వాట్సాప్</a>&zwnj; నంబర్&zwnj;ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజలు పంపేసమాచారం ఆధారంగా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఆర్టీసీ, సరకు రవాణా వాహనాల డ్రైవర్ల కోసం వారు నిరంతరం కలుసుకునే చోట్లే ఉచిత కంటి పరీక్షల శిబిరాలను నిర్వహించాలని రవాణా శాఖకు ఆదేశించారు. నగరాల్లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, విద్యార్థి హాస్టళ్లు భద్రత, అనుమతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, వాటి యాజమాన్యాలను జవాబుదారీ చేయాలని సూచించారు. హైదరాబాద్&zwnj; వంటి నగరాల్లో ఓఆర్&zwnj;ఆర్&zwnj; పరిసరాల్లో నిర్మాణ వ్యర్థాలను పారబోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీలను బాధ్యులను చేస్తూ జరిమానాలు విధించాలని ఆదేశించారు.&nbsp;</p>
Read Entire Article