Telangana Latest News: తెలంగాణలో అధికారుల సెలవులు రద్దు- ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారి- తుపానుపై సీఎం సమీక్ష

1 month ago 2
ARTICLE AD
<p><strong>Telangana CM Revanth Reddy Review On Montha Cyclone:</strong> తెలంగాణ వ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావం గట్టిగానే ఉంది. పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. జోరుగా వర్షాలు పడుతున్న టైంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం సేకరణ జరుగుతున్న టైంలో వర్షాల వల్ల ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫీల్డ్&zwnj;లో ఏం జరుగుతుందో సీఎంవోకు ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలని చెప్పారు. అలా రిపోర్టు ఇవ్వకపోయిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్&zwnj; &nbsp;నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. &nbsp;<br /><br />విపత్తు టైంలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> ఆదేశించారు. రైతులకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరిస్తున్న టైంలో వర్షాలు పడుతున్నందున ఆటంకం లేకుండా చూడాలని సూచించారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కేంద్రానికి ఒక మండల స్థాయి అధికారి నియమించాలని తెలిపారు. వర్షాలు ఎక్కువగా ఉన్న చోట ధాన్యాన్ని సమీపంలోని పంక్షన్ హాల్&zwnj;లోకి తరలించాలని చెప్పారు. ప్రతి ధాన్యం కేంద్రంలో ఏం జరుగుతుందో చెబుతూ ప్రతి రోజూ రిపోర్టు ఇవ్వాలని నిర్దేశించారు. అలా రిపోర్టు ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.&nbsp;</p> <p>క్షేత్రస్థాయిలో సమస్యలు వెంటనే తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రతి జిల్లా యంత్రాంగం ఒక మానిటరింగ్ సెంటర్ ేర్పాటు చేయాలని చెప్పారు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని చెప్పారు. రోడ్లు పరిస్థితి ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్&zwnj;నుడైవర్ట్ చేయాలని చెప్పారు. వాగులు వంకలు, చెరువుల పరిస్థితి తెలుసుకొని సమీపంలోని ప్రజలను అధికారులను అలర్ట్ చేయాలని ఆదేశించారు.&nbsp;</p> <p>ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమన్నారంటే... "16 జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది<br />దీనిపై ముందస్తు చర్యలు తీసుకున్నా అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వేల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలి. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి. అవసరమైనచోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి. వరంగల్&zwnj;లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలి. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి .జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధింత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలి.&nbsp;</p> <p>ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదు. వాతావరణ పరిస్థితుల బాగోలేకపోవడంతో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నా .రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తా. తుపాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది." అని చెప్పారు.&nbsp;</p> <p>ఇప్పటికే భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్లన్నీ మునిగిపోయాయి. పంటలు నీట మునిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పూర్తిగా పాడైపోయింది. రాశులుగా పోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం మొలకెత్తింది. మరికొద్ది రోజులుల చేతికి వస్తుందని అనుకున్న పంట ఇలా నీటిపాలు కావడంపై అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వాపోతున్నారు. &nbsp;<br />&nbsp;</p>
Read Entire Article