Telangana Congress Risk: రేవంత్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ - కాలేజీలకు తోడుగా ఆస్పత్రులు - ఆరోగ్యశ్రీబంద్ !

2 months ago 3
ARTICLE AD
<p>Telangana Arogyasri treatments Stop: తెలంగాణ ప్రభుత్వాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. బిల్లుల బకాయిలు పేరుకుపోతూండటంతో అందరూ.. తమ సేవల్ని నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే &nbsp;ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యా సంస్థలు నిరవధిక బంద్&zwnj; ప్రారంభించాయి. అదే సమయంలో, ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆస్పత్రులు &nbsp; &nbsp;తమకూ బకాయిలు పెరిగిపోయాయని తాము కూడా సేవల్ని నిలిపివేస్తామని ప్రకటించారు.&nbsp;</p> <p>తెలంగాణలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, నర్సింగ్ కాలేజీలు ఫీజు రీయింబర్స్&zwnj;మెంట్ బకాయిలు సుమారు రూ. &nbsp;8,000 కోట్లు వరకూ పెడింగ్ ఉన్నాయి. వీటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాలేజీలు నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్స్ , &nbsp;ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఫెడరేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి.&nbsp;</p> <p>ప్రభుత్వం బడ్జెట్&zwnj;లో కేటాయించినా ఫీజు రీయింబర్స్&zwnj;మెంట్&zwnj;లు విడుదల చేయకపోవడం, స్కాలర్&zwnj;షిప్&zwnj;లు ఆలస్యం కావడం వల్ల కాలేజీలు జీతాలు, ఇతర ఖర్చులు చెల్లించలేకపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తం 12 లక్షల మంది విద్యార్థులు క్లాసులు జరగకపోవడం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొ చర్చలు జరిగినా ఫలితం లేకపోవడంతో యాజమాన్యాలు &nbsp;బంద్&zwnj;కు వెళ్లాయి. ముఖ్యమంత్రి <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యలపై మంత్రులతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. కాలేజీలకో ఎంతో కొంత నిధులు సర్దుబాటు చేస్తేనే వారు కాలేజీలు మళ్లీ ప్రారంభించే అవకాశం ఉది.&nbsp;<br />&nbsp;<br />అదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ నెట్&zwnj;వర్క్ ఆస్పత్రులు మంగళవారం నుంచి సేవలను ఆపేస్తామని ప్రకటించింది. &nbsp;ప్రభుత్వం రూ. 1400 కోట్ల వరకూ బకాయి ఉందని .. వాటిని చెల్లించకపోవడం, ప్యాకేజీ రేట్లు రివైజ్ చేయకపోవడం, MoUలు మార్చకపోవడం వల్ల ఆస్పత్రులకు సమస్యలు వస్తున్నాయి. &nbsp;. చిన్న, మధ్యస్థ ఆస్పత్రులు &nbsp;ఆరోగ్యశ్రీ రోగులపై 75-85 శాతం ఆధారపడి ఉంటాయి, డబ్బులు రాకపోతే మూసివేయాల్సి వస్తుందని &nbsp;అంటున్నారు.&nbsp;</p> <p>అటు కాలేజీలు సమ్మెలోకి వెళ్లాయి.. ఇటు ఆరోగ్యశ్రీ &nbsp;బకాయిల కోసం ఆస్పత్రులూ అదే దారిలో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడం తెలంగాణ ప్రభుత్వానికి అత్యవసరంగా మారింది.&nbsp;</p>
Read Entire Article