<p><br />తెలంగాణ బడ్జెట్‌ను మల్లు భట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. 3 లక్షల 24 వేల 234 కోట్లతో 2026-27 సంవత్సరానికి పద్దను ప్రవేశ పెడుతున్నట్టు మల్లు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. తెలంగాణ మూలధన వ్యయం 47, 267 కోట్లు ఉంటే, రెవెన్యూ వ్యయం 2, 34, 406 కోట్లుగా ఉంది. తలసరి ఆదాయం 4, 18, 931 రూపాయలు అని ఆర్థిక మంత్రి వివరించారు. </p>
<p><strong>మేం పాలకులం కాదు- సేవకులం: భట్టి విక్రమార్క </strong></p>
<p>ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం. అంబేద్కర్‌ చెప్పిన అడుగుజాడల్లోనే పాలిస్తున్నాం. మేం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ప్రజలు అప్పగించిన అధికారాన్ని బాధ్యతగా భావించి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకుపోతున్నాం. ఇతరులకు సేవ చేయడంలో మనల్ని మనం మర్చిపోవడమే మనల్ని మనం తెలుసుకోవడమని గాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటున్నాం. రెండేళ్లుగా ప్రజల తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నెలబెట్టుకుంటూ వారి ఆశలను నెరవేరుస్తున్నాం.</p>
<p>తెలంగాణ బడ్జెట్ - రూ. 3,24,234 కోట్లు<br />రెవెన్యూ యాయం - 2,34,406 కోట్లు<br />మూలధన వ్యయం - 47,267 కోట్లు</p>
<p>రాష్ట్ర తలసరి ఆదాయం - 4లక్షల 18వేల 931 కోట్లు <br />తెలంగాణ వృద్ధి రేటు - 10.2 శాతం<br />జీఎస్డీపీ - రూ.17 లక్షల 82 వేల కోట్లు<br />గతేడాదితో పోలిస్తే 10.7 శాతం వృద్ధి</p>