Telangana Amarnath Yatra: తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రకు పోటెత్తిన భక్తులు! ఏడాదికి మూడు రోజులే అవకాశం , సలేశ్వరం సాహసయాత్ర రూట్ మ్యాప్!

1 week ago 3
ARTICLE AD
<p><strong>Mahbubnagar News:</strong> తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతర చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. నల్లమలలో దట్టమైన అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉండే ఇరుకైన లోయ ఇది. ఇక్కడ మూడు రోజుల పాటూ జరిగే ఈ జాతరకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఏడాదికి ఓసారి చెంచులు నిర్వహించే ఊత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటీపడతారు. కష్టమైనా కానీ వివిధ ప్రాంతాల నుంచి భారీగా సలేశ్వరం చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. అటవీ ప్రాంతం కావడం పులులు ఎక్కువగా తిరిగే ప్రదేశం కావడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటవీ శాఖ అధికారులు.&nbsp;<br /><strong>&nbsp;</strong><br /><strong>సలేశ్వరం ఎలా వెళ్లాలి?</strong></p> <p>మహబూబ్ నగర్ జిల్ &nbsp;అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ నుంచి పుల్లయపల్లి, రాంపూర్, శ్రీశైలం మార్గంలో చెంచుపెంట మీదుగా 20 కిలోమీటర్లు వాహనంలో ప్రయాణించాలి. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు శ్రీశైలం హైవేపై అమ్రాబాద్ మండలం మన్ననూరు నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించాలి. పర్హాబాద్ జంక్షన్ దగ్గర అటవీశాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకుని అడవిలోకి అడుగుపెట్టాలి. మీరు తీసుకెళ్లే వాహనం ఆధారంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సలేశ్వరానికి 4 కిలోమీటర్ల ముందు వాహనాలు నిలిపేస్తారు.అక్కడి నుంచి కొండలు, గుట్టలు, రాళ్లు దాటుకుంటూ దాదాపు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వేళితే ఆలయానికి చేరుకోవచ్చు.</p> <p>కాలినడకన వెళ్లేవారు &nbsp;నాగర్&zwnj;కర్నూల్&zwnj; జిల్లా బల్మూరు మండలం అంబగిరి, లింగాల మండలం, అప్పాయిపల్లి మీదుగా 30 కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత తాగునీటి వసతి ఉంటుంది. అక్కడ కాసేపు సేదతీరి మళ్లీ నడక ప్రారంభిస్తే అక్కడి నుంచి మరో 20కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సలేశ్వరం. చిన్నారులు, వృద్ధులు ఈ యాత్ర చేయడం కష్టమే.</p> <p>సలేశ్వరం క్షేత్రానికి ఎదురుగా ఉన్న ఎత్తైన కొండలపై నుంచి జాలువారే జలపాతాలు భక్తులను కనువిందు చేస్తాయి. భక్తులు మాత్రమే కాదు పర్యాటకులు కూడా సలేశ్వరం యాత్ర చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. నడిచి వెళ్లే మార్గంలో నెమళ్లు, జింకలు, &nbsp;అటవీ జంతువులు &nbsp;కనిపిస్తాయి. ఇదో సాహసయాత్ర.</p> <p>సలేశ్వరం జాతరకు వెళ్లే భక్తులు అటవీ ప్రాంతాన్ని కలుషితం చేయొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, పాలిథిన్ కవర్లు తీసుకురావొద్దని..తీసుకొస్తే మార్గ మధ్యలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాయింట్లలో మాత్రమే పడేయాలని చెబుతున్నారు. అన్నదానం చేయాలి అనుకునే భక్తులు ఆకులు ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు.</p> <p><strong>అజ్ఞాతవాసంలో పాండవులు కొన్నాళ్లు ఇక్కడే!</strong></p> <p>లింగాల మండలం దట్టమైన నల్లమల అడవిలో ఉన్న కొండ గుహల్లోనే పాండవులు కొన్నాళ్లు అజ్ఞాతవాసం చేశారని చెబుతారు. అరణ్యవాసం పూర్తిచేసుకుని విరాట రాజు కొలువుకి వెళ్లేలోగా మధ్యలో కొన్ని రోజు ఈ కొండగుహల్లోనే ఉన్నారని స్థలపురాణం. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఈ క్షేత్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంల ఉన్న కృష్ణానది నీటిని శివుడు రప్పించాడని పురాణగాధ. శివపార్వతులు ఇక్కడ తపస్సు చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. సలేశ్వరాన్ని మొదట శైలపురం అని పిలిచేవారు..కాలక్రమేణా అది సలేశ్వరంగా మారింది. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు నుంచి 3 రోజులు జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి గుహలో కొలువైన లింగమయ్యని దర్శించుకుంటారు. ఏడాదికి మూడు రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయంలో చెంచు పూజారులు పూజలు చేస్తారు.<br />&nbsp;&nbsp;<br /><strong>గుహలో కొలువైన లింగమయ్య</strong></p> <p>సలేశ్వరం క్షేత్రంలో శివయ్య &nbsp;రెండు సహజసిద్ధమైన గుహల్లో దర్శనమిస్తాడు. పైనున్న గుహలో ప్రధాన దైవం లింగమయ్య.. మరో గుహలో మరో శివలింగం ఉంటుంది. ఆలయం ఎదుట గంగమ్మ, వీరభద్రుడి విగ్రహాలుంటాయి.. ఇక్కడ భారీగా కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు మంచి ఆలోచనతో కళ్లు మూసుకుని శివయ్యను ధ్యానిస్తే చాలంటారు చెంచుపూజారులు</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/spirituality/these-are-the-5-richest-temples-in-india-know-in-telugu-240031" width="631" height="381" scrolling="no"></iframe>&nbsp;</p>
Read Entire Article