TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు

1 month ago 5
ARTICLE AD
<p>అమరావతి: హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్&zwnj;హౌస్ డ్రగ్స్ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్&zwnj;కు పాజిటివ్&zwnj;గా తేలడం ఆ పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టింది. డ్రగ్స్ తీసుకునే వ్యక్తులకు ప్రజాప్రతినిధులుగా కొనసాగే నైతిక హక్కు లేదంటూ వైఎస్సార్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సహా పలువురు నేతలు ఘాటుగా స్పందించారు.</p> <p><strong>చంద్రబాబు హాట్-లైన్ రాజకీయాలు: కాకాణి గోవర్ధన్ రెడ్డి</strong><br />టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్&zwnj;కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ఎస్పీ ధృవీకరించారని, అటువంటి వ్యక్తికి ఎంపీగా కొనసాగే అర్హత లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, స్పష్టం చేశారు. &lsquo;ఎంపీ పుట్టా మహేష్ వెంట ఉన్న వ్యక్తులు పోలీసులపైనే కాల్పులు జరిపారు. ఇంతటి తీవ్రమైన డ్రగ్స్ కేసులో తన పార్టీ ఎంపీని కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఆయన హాట్-లైన్ రాజకీయాలు చేస్తూ వ్యవస్థలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఇది సాదాసీదా విషయం కాదు. దేశ భద్రత, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం&rsquo; అని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు.</p> <p><strong>తెలుగు డ్రగ్స్ పార్టీగా టీడీపీ: సుధాకర్ బాబు విమర్శలు</strong><br />మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు టీడీపీపై విమర్శలు గుప్పించారు. &lsquo;టీడీపీ కాస్తా ఇప్పుడు 'తెలుగు డ్రగ్స్ పార్టీ'గా మారిపోయింది. ఒక లోక్&zwnj;సభ ఎంపీ అయి ఉండి, మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్&zwnj;సభకు పంపారు. అసలు పార్లమెంట్&zwnj;లో అడుగుపెట్టే నైతిక హక్కు పుట్టా మహేష్&zwnj;కు లేదు. ఆయన వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి&rsquo; అని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.</p> <p><strong>వైసీపీ ఆరోపణలు, డిమాండ్లు ఇవే..</strong><br />డ్రగ్స్ కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఉండకూడదు. డ్రగ్స్ పార్టీలో పోలీసులపై కాల్పులు జరపడం నేరపూరిత చర్య. టీడీపీ ఎంపీని రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని &nbsp;ఆరోపించారు</p> <p><strong>'చంద్రబాబు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి': వైఎస్ షర్మిల</strong><br />విజయనగరం పర్యటనలో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసుపై తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఏలూరు <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇక్కడ కొకైన్&zwnj;తో విందులు చేస్తూ పట్టుబడటం అత్యంత సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఎంపీపై ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన ఎంపీ యువతకు ఏం సందేశం ఇస్తున్నారని, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. డ్రగ్స్&zwnj;పై నిజంగా ఉక్కుపాదం మోపాలనే ఆలోచన ఉంటే, ఎంపీపై కఠిన చర్యలు తీసుకుని <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె సవాల్ విసిరారు.</p>
Read Entire Article