Tamilnadu ED: క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్

1 month ago 2
ARTICLE AD
<p>Bribes to MK Stalin: తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై (MAWS) శాఖలో 2,538 ప్రభుత్వ పదవులకు సంబంధించి 'క్యాష్ ఫర్ జాబ్స్' కుంభకోణం బయటపడిందని ఈడీ ప్రకటించింది. &nbsp;ఈ పదవుల ఆర్డర్లను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగస్టు 6న అధికారులకు అందజేశారు. ఎన్&zwnj;ఫోర్స్&zwnj;మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ మోసపూరిత ప్రక్రియలో పదవి ఒక్కటికి రూ.25 నుంచి 35 లక్షల వరకు లంచాలు సేకరించారని, మొత్తం రూ.888 కోట్ల మోసం జరిగిందని ఆరోపించింది. &nbsp;బ్యాంక్ మోసం కేసులో జరిగిన దాడుల సమయంలో &nbsp;ఈ విషయాలుతేలాయి. ED తమిళనాడు పోలీస్ చీఫ్&zwnj;కు 232 పేజీల రిపోర్ట్ పంపి, పరిశోధన చేయాలని కోరింది. విపక్షాలు CBI దర్యాప్తు డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.</p> <p>తమిళనాడు MAWS శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ఇంజనీర్లు, సానిటరీ ఇన్&zwnj;స్పెక్టర్ల వంటి 2,538 పదవుల భర్తీకి 2024 ప్రారంభంలో 1.12 లక్ష మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలు అన్నా యూనివర్సిటీ &nbsp;2024లో నిర్వహించింది. &nbsp;ED ప్రకారం, ఈ ప్రక్రియను రిగ్ చేసి కనీసం 150 అభ్యర్థులకు &nbsp;ఉద్యోగాలు కేటాయించారు. ప్రతి పదవికి రూ.25 నుంచి 35 లక్షల వరకు లంచాలు సేకరించి, మధ్యవర్తుల ద్వారా బలమైన రాజకీయ నాయకులకు, వారి సన్నిహితులకు చేరవేశారు. మొత్తం 2,538 పదవులకు రూ.35 లక్షల చొప్పున లెక్కిస్తే, రూ.888 కోట్ల మోసం జరిగినట్లు ED అంచనా. ఈ మోసం వల్ల అర్హులైన అభ్యర్థుల కలలు దెబ్బతిన్నాయని, లంచాలు చెల్లించలేని వారు ఉద్యోగాలు కోల్పోయారని ED నివేదికలో పేర్కొన్నారు.<br />&nbsp;<br />ED దర్యాప్తు మొదట MAWS మంత్రి కెఎన్ నెహ్రూ సోదరుడు ఎన్ రవిచంద్రన్ , అతని కంపెనీ ట్రూ వాల్యూ హోమ్స్ (TVH) గ్రూప్&zwnj;కు సంబంధించిన బ్యాంక్ మోసం కేసు నుంచి ప్రారంభమైంది. ఈ కేసులో రూ.30 కోట్ల రుణాల విషయంలో చేసిన దర్యాప్తులో &nbsp;హవాలా లావాదేవీలు ,లంచాల చైన్ కూడా బయటపడ్డాయి. ఏడాది ముందు జరిగిన దాడుల సమయంలో ఈ ఆధారాలు సేకరించారు. ఏప్రిల్&zwnj;లో తమిళనాడు పోలీసులకు హెచ్చరిక పంపినప్పటికీ, చర్యలు తీసుకోలేదని ED ఆరోపిస్తోంది. &nbsp;(అక్టోబర్ 29 మానిటరీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ (PMLA) సెక్షన్ 66(2) ప్రకారం, 232 పేజీల &nbsp;రిపోర్ట్ పోలీస్ చీఫ్&zwnj;కు లేఖ రాసి, పరిశోధన చేయాలని కోరింది. &nbsp; మోసపూరిత ప్రక్రియ మోడస్ ఆపరండీ, 150 అనర్హుల పేర్లు, లంచాల చైన్, మధ్యవర్తుల పాత్రలు &nbsp;ఇందులో వివరించారు.&nbsp;</p> <p>&nbsp;ప్రధాన పాత్రధారులుగా మంత్రి నెహ్రూ సోదరుడు, సెక్రటరీలు &nbsp;పదవి ఆర్డర్లు అందజేసినవారిగా, ఈ మోసానికి సంబంధం ఉందని &nbsp;సీఎం స్టాలిన్ పేరునూ చేర్చారు. &nbsp;MAWS మంత్రి, సోదరుడు రవిచంద్రన్ ద్వారా &nbsp;ఈ మోసం చేశారని ఈడీ చెబుతోంది. &nbsp; విపక్షాలు ఈ మోసాన్ని 'డీప్-రూటెడ్ సిస్టమాటిక్ కరప్షన్'గా విమర్శిస్తున్నాయి. మాజీ తమిళనాడు BJP అధ్యక్షుడు కె అన్నమలై, "స్టాలిన్ పాలిటిక్స్&zwnj;లో ఈ మోసం భాగం అని CBI దర్యాప్తునకు డిమాండ్ చేశారు. &nbsp;</p> <p>ED లేఖ ప్రకారం, తమిళనాడు పోలీసులు తక్షణమే దర్యాప్తు చేపట్టాలి. ఈ మోసం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది, ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికల సమయంలో. BJP, AIADMK వంటి విపక్షాలు ఈ విషయాన్ని పెద్దగా ప్రచారం చేస్తున్నాయి.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/news/ten-severe-cyclones-that-killed-millions-of-people-225283" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article