Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం.. ఉప్పొంగిపోయిన తల్లిదండ్రులు

3 weeks ago 4
ARTICLE AD
<p>చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళ వెట్రి కజగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ ఆదివారం ఉదయం 10 గంటలకు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్&zwnj;లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం అందుకు వేదికగా నిలిచింది. విజయ్&zwnj;తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.</p> <p>విజయ్ తల్లితండ్రులు, కాంగ్రెస్ ఎంపీ <a title="రాహుల్ గాంధీ" href="https://telugu.abplive.com/topic/Rahul-Gandhi" data-type="interlinkingkeywords">రాహుల్ గాంధీ</a> ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పండుగ వాతావరణం కనిపించింది. <a href="https://telugu.abplive.com/news/india/actress-trisha-krishnan-attends-vijay-cm-oath-cermony-at-chennai-nehru-stadium-watch-videos-246856">సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.</a> అంతకుముందు శనివారం సాయంత్రం విజయ్ తన మిత్రపక్షాల మద్దతు లేఖలతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్&zwnj;ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్&zwnj;ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 13లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆయనకు సూచించారు.&nbsp;</p> <p><strong>చిన్న పార్టీల మద్దతు కూడగట్టిన టీవీకే</strong><br />తమిళనాడు ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడి కాగా.. 108 స్థానాలతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ (118) లేకపోవడంతో విజయ్ కొంత ఇబ్బంది పడ్డారు. ఎంతలా ఉంటే తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ నాలుగుసార్లు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్&zwnj;తో భేటీ అయ్యారు. మద్దతు ఉందని లేఖలు ఇచ్చినా కొన్ని ఫేక్ లెటర్స్ అంటూ ప్రకటనలు రావడంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. చివరకు చిన్న పార్టీలతో జరిపిన చర్చలు ఫలించి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/F8k7qXKkCzA?si=EnMgNRCCzzBe1WGD" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2) పార్టీలు విజయ్&zwnj;కు మద్దతు ప్రకటించాయి. దీంతో టీవీకే అధినేత విజయ్ బలం 120కి చేరింది. <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> మినహా మిగిలిన పార్టీలు బయటి నుండి మద్దతు ఇస్తూనే డీఎంకే కూటమిలో కొనసాగుతామని స్పష్టం చేశాయి. రాష్ట్రపతి పాలన రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తాము మద్దతు ఇచ్చామని వీసీకే నేత తిరుమావళవన్ తెలిపారు.</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/10/ea47b9318a4f823fb495414b059501321778388494256233_original.jpg" /></p> <p><strong>ఏఎంఎంకే ఎమ్మెల్యే మద్దతుపై వివాదం</strong><br />ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఒక వివాదం కూడా తెరపైకి వచ్చింది. మన్నార్గుడి ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ తమకు మద్దతు ఇచ్చారని టీవీకే పేర్కొనగా, ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ దీనిని తీవ్రంగా ఖండించారు. టీవీకే వారు నకిలీ లేఖను సృష్టించారని, సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆయన గవర్నర్&zwnj;కు ఫిర్యాదు చేశారు. కామరాజ్&zwnj;ను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అయితే, కామరాజ్ స్వయంగా సంతకం చేస్తున్న వీడియోను టీవీకే విడుదల చేసింది. కానీ, కామరాజ్ మీడియా ముందుకు వచ్చి తాను ఎవరికీ మద్దతు లేఖ ఇవ్వలేదని స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.</p>
Read Entire Article