T20 World Cup 2026: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే, ఇన్సూరెన్స్ చెల్లుబాటు అవుతుందా? ప్రయోజనం ఎవరికి

2 months ago 6
ARTICLE AD
<p>T20 World Cup 2026:&nbsp;భారత్- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కేవలం ఒక గేమ్ కాదు. ఎన్నో భావోద్వేగాలతో కూడిన మ్యాచ్ మిలియన్ల డాలర్ల ఆదాయం సమకూర్చుతోంది. T20 ప్రపంచ కప్ వంటి టోర్నమెంట్&zwnj;లో ఈ 2 దేశాల జట్లు తలపడినప్పుడు, ప్రపంచం దృష్టి మ్యాచ్&zwnj;పై నెలకొంటుంది. కానీ చివరి నిమిషంలోమ్యాచ్&nbsp; జరగకపోతే, ఎవరికి పాయింట్లు లభిస్తాయనేది పెద్ద విషయం కాదు. గెలుపోటముల ప్రస్తావన పక్కన పెడితే.. అసలు ప్రశ్న ఏంటంటే.. ఈ మ్యాచ్ సంబంధించి నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు. ఇన్సూరెన్స్ నగదు మొత్తం ఎవరికి వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.</p> <p><strong>ఇండియాతో ఆడబోమని తేల్చి చెప్పిన పాక్ ప్రభుత్వం</strong></p> <p>T20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, ఫిబ్రవరి 15న భారత్&zwnj;తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ చెప్పడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ టోర్నమెంట్ అతిపెద్ద ఆకర్షణగా భావిస్తారు. భారత్- పాకిస్తాన్ మ్యాచ్&zwnj;తో ఎంతో ఆదాయం, వీక్షకుల సంఖ్య, యాడ్ రెవెన్యూ లాంటివి ప్రభావితం అవుతాయి. ఏ ఇతర మ్యాచ్ కంటే చాలా రెట్లు ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఒక్క మ్యాచ్ లేకపోతే మొత్తం టోర్నమెంట్ ఆర్థిక పరిస్థితి మారిపోతుంది.&nbsp;</p> <p><strong>ఈ ఒక్క మ్యాచ్&zwnj;తో బిజినెస్ ఎంత..&nbsp;</strong></p> <p>భారత్- పాకిస్తాన్ మ్యాచ్ బిజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రసార హక్కులు, యాడ్స్, టిక్కెట్ల అమ్మకాలు, స్పాన్సర్&zwnj;షిప్&zwnj;తో సహా మ్యాచ్ విలువ దాదాపు $500 మిలియన్లు ఉంటుందని అంచనా వేశారు. భారత కరెన్సీలో వేల కోట్ల విలువ. 10 సెకన్ల స్లాట్&zwnj;కు యాడ్స్&zwnj;కు 2.5 నుండి 4 మిలియన్ల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. ఒకవేళ మ్యాచ్ రద్దు అనేది ఆర్థికంగా భారీ నష్టమే.</p> <p><strong>మ్యాచ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?</strong></p> <p>ఇంత పెద్ద ఈవెంట్&zwnj;ను బట్టి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ వంటి హై-ప్రొఫైల్ మ్యాచ్&zwnj;లకు ప్రత్యేక ఈవెంట్ బీమా తీసుకుంటారు.&nbsp; ఇది భద్రత, వైద్య ఏర్పాట్లు, ఈవెంట్ సంబంధిత నష్టాలను కవర్ చేస్తుంది. సాధారణంగా భద్రత, అవసరమైన ఏర్పాట్లకు దాదాపు కోటి ఖర్చవుతుంది. అయితే బీమా కవరేజ్ వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. 2016లో జరిగిన T20 మ్యాచ్&zwnj;కు సుమారు రూ.200 కోట్ల బీమా కవర్ లభించింది.</p> <p><strong>మ్యాచ్ రద్దు అయితే డబ్బు ఎవరికి ?</strong></p> <p>భారత్- పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయితే ఇన్సూరెన్స్ డబ్బు ప్రధానంగా నిర్వాహకులకు, సంబంధిత నిర్వాహకులకు చెల్లిస్తారు. ఇందులో ప్రధానంగా టోర్నమెంట్ నిర్వాహకులు, క్రికెట్ బోర్డులు ఉన్నాయి. వారు ఈవెంట్ కోసం,&nbsp; స్టేడియం బుకింగ్, లాజిస్టిక్స్ కోసం భారీగా ఖర్చు చేస్తారు. ఇంకా బ్రాడ్&zwnj;కాస్టర్లు యాడ్స్, ప్రసార ఆదాయాన్ని కోల్పోతారు కనుక వారు సైతం కొంతమొత్తం బీమా ప్రయోజనాలు పొందుతారు. అయితే, ఒక్క బంతి కూడా పడకపోతే మాత్రమే ఇది చెల్లుతుంది.</p> <p>టీ20 వరల్డ్ కప్&zwnj;లో ఆ మ్యాచ్ రద్దు అయితే ప్రసార హక్కులు పొందిన వారు ఆర్థిక నష్టాలు చవిచూస్తారు. టీవీ, డిజిటల్ ప్లాట్&zwnj;ఫారమ్&zwnj;లు మాత్రమే ₹300 కోట్ల వరకు నష్టపోతాయని అంచనా. ఈ నష్టాలను ఇన్సూరెన్స్ పాక్షికంగా భర్తీ చేస్తుంది. స్పాన్సర్&zwnj;షిప్ సంబంధిత ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ కింద కవర్ చేస్తారు.&nbsp;</p>
Read Entire Article