Special Tran For Mahakumbha Mela: 8న కాకినాడ నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైలు- టైమింగ్స్‌ ఇతర వివరాలు ఇవే!

10 months ago 8
ARTICLE AD
<p><strong>Special Tran For Mahakumbha Mela:</strong> ఉభ&zwnj;య గోదావ&zwnj;రి జిల్లాల నుంచి కుంభ&zwnj;మేళాకు వెళ్లే భ&zwnj;క్తులకు గుడ్&zwnj;న్యూస్ ఇది. ఈ నెల 8న అంటే శ&zwnj;నివారం కాకినాడ నుంచి ప్ర&zwnj;యాగ్&zwnj;రాజ్&zwnj;కు ప్ర&zwnj;త్యేక రైలును ఏర్పాటు చేస్తున్న&zwnj;ట్లు రైల్వేశాఖ వెల్ల&zwnj;డించింది. ఇప్ప&zwnj;టికే ఉభ&zwnj;య&zwnj;గోదావ&zwnj;రి జిల్లాల&zwnj;నుంచి ప్ర&zwnj;యాగ్&zwnj;రాజ్&zwnj;కు వెళ్లేలా కాకినాడ&zwnj;, రాజ&zwnj;మహేంద్ర&zwnj;వ&zwnj;రం, అమ&zwnj;లాపురం ఆర్టీసీ డిపోల నుంచి ప్ర&zwnj;త్యేక బ&zwnj;స్సుల&zwnj;ను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇదిలా ఉంటే తాజాగా రైల్వేశాఖ కూడా కాకినాడ నుంచి ప్ర&zwnj;యాగ్&zwnj;రాజ్ కుంభ&zwnj;మేళాకు ప్ర&zwnj;త్యేక రైలును ఏర్పాటు చేయ&zwnj;డంపై గోదావ&zwnj;రి జిల్లాల ప్ర&zwnj;జ&zwnj;లు హ&zwnj;ర్షం వ్య&zwnj;క్తం చేస్తున్నారు..&nbsp;</p> <p><strong>కాకినాడ ఎంపీ విజ్ఞ&zwnj;ప్తితో స్పందించిన రైల్వేశాఖ&zwnj;..</strong><br />ఉత్తరప్రదేశ్&zwnj;లో ప్రయాగ్ రాజ్ వద్ద జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహా కుంభమేళాకు హాజరయ్యేందుకు గతంలో రైల్వే శాఖ కాకినాడ నుంచి ప్రయోగరాజ్&zwnj;కు ఫిబ్రవరి 20న ఏసీ బోగీలతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది.&nbsp;</p> <p>భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్టి ఉంచుకుని సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా ఏసీతో పాటు స్లీపర్ క్లాస్ బోగీలతో అదనంగా మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జనవరి 20న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్&zwnj;కు లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ ఫిబ్రవరి 8న మరో అదనపు రైలును ఏర్పాటు చేసింది. &nbsp;</p> <p><strong>Also Read: <a title="ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్&zwnj;కు డేంజర్&zwnj; బెల్స్&zwnj;- మేల్కోకుంటే ముప్పు తప్పదు!" href="https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/ap-labour-minister-vasamsetti-subhash-followers-behavior-is-becoming-dangerous-to-him-196924" target="_blank" rel="noopener">ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్&zwnj;కు డేంజర్&zwnj; బెల్స్&zwnj;- మేల్కోకుంటే ముప్పు తప్పదు!</a></strong></p> <p><strong>రైలు బ&zwnj;య&zwnj;ల్దేరేది ఇలా...</strong><br />కాకినాడ రైల్వే ష్టేష&zwnj;న్ నుంచి ఈనెల 8న శ&zwnj;నివారం 07095 నెంబర్ రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు బ&zwnj;య&zwnj;ల్దేర&zwnj;నున్న&zwnj;ట్లు అధికారులు తెలిపారు. కాకినాడ నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక రైలు రెండు రోజుల తర్వాత ప్రయాగ్&zwnj;రాజ్&zwnj;కు చేరుకోనుంది. ఇప్ప&zwnj;టికే ఈ నెంబ&zwnj;రుతో ఆన్&zwnj;లైన్లో కూడా టిక్కెట్ రిజ&zwnj;ర్వేష&zwnj;న్లు కొన&zwnj;సాగుతున్నాయి.. ఇప్ప&zwnj;టికే 20న ఓ ఏసీ బోగీల&zwnj;తో ఉండే ట్రైన్ మాత్ర&zwnj;మే కాకుండా అంత&zwnj;కంటే ముందుగానే అంటే ఎనిమిదిన సామాన్య భ&zwnj;క్తుల&zwnj;కు ఈ రైలు అందుబాటులో ఉన్నందున త&zwnj;మ ప్ర&zwnj;యాణాన్ని విర&zwnj;మించుకున్న వారుకూడా కుంభ&zwnj;మేళాకు వెళ్లేందుకు స&zwnj;న్న&zwnj;ధ్ద&zwnj;మ&zwnj;వుతున్నారు..&nbsp;</p> <p><strong>కృత&zwnj;జ్ఞ&zwnj;త&zwnj;లు తెలిపిన ఎంపీ..</strong><br />కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ లేఖ&zwnj;కు స్పందిస్తూ రైల్వే శాఖ కాకినాడ నుంచి కుంభమేళాకు మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేయ&zwnj;డంతో ఆయ&zwnj;న రైల్వే మంత్రి అశ్విని వైష్ట&zwnj;వ్&zwnj;కు కృత&zwnj;జ్ఞ&zwnj;త&zwnj;లు తెలిపారు. భ&zwnj;క్తుల అవ&zwnj;స&zwnj;రానికి అనుగుణంగా ప్రత్యేక రైలు ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ జిల్లా ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.</p> <p><strong>Also Read: <a title="రెపో రేట్&zwnj; నుంచి ద్రవ్యోల్బణం లెక్కల వరకు - ఆర్&zwnj;బీఐ గవర్నర్ ప్రధాన ప్రకటనలు" href="https://telugu.abplive.com/business/from-repo-rate-to-inflation-calculations-these-are-the-key-announcements-made-by-the-rbi-governor-malhotra-197019" target="_blank" rel="noopener">రెపో రేట్&zwnj; నుంచి ద్రవ్యోల్బణం లెక్కల వరకు - ఆర్&zwnj;బీఐ గవర్నర్ ప్రధాన ప్రకటనలు</a></strong></p>
Read Entire Article