Rushikonda Palace: లగ్జరీ హోటల్‌గా రుషికొండ ప్యాలెస్ - ప్రముఖ సంస్థల ఆసక్తి - త్వరలోనే నిర్ణయం

11 hours ago 2
ARTICLE AD
<p><strong>Rushikonda Palace as a luxury hotel:</strong> విశాఖపట్నం రుషికొండపై నిర్మించిన వివాదాస్పద భవనాలను లగ్జరీ హోటల్&zwnj;గా మార్చేందుకు ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. టాటా గ్రూప్&zwnj;కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ &nbsp;IHCL-తాజ్ గ్రూప్) , లీలా ప్యాలెస్ హోటల్స్ సహా లెమన్ ట్రీ, మహీంద్రా, మారియట్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చాయి. అయితే హోటల్ గా ఉపయోగించడానికి సాధ్యమా కాదా అన్నదానిపై &nbsp;కొన్ని అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కొనసాగుతున్నాయి.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p><strong>రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్నదానిపై మంత్రుల బృందం చర్చలు&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GoM) వివిధ ఆప్షన్లను ఖరారు చేసిన తర్వాత తమ సిఫారసులను ఆంధ్రప్రదేశ్ కేబినెట్&zwnj; ముందు ఉంచనుంది. ఈ భవనాలను పర్యాటక రంగంలో ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం సమావేశం అయిన &nbsp;మంత్రుల బృందం .. మరోసారి సమావేశం తర్వాత సిఫారసులు సమర్పించే అవకాశం ఉంది.&nbsp;</p> <p><strong>హోటల్ గా మార్చేందుకు పలు ముఖ్య సంస్థల ఆసక్తి&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</strong></p> <p>రుషికొండ భవనాలను లగ్జరీ హోటల్&zwnj;గా అభివృద్ధి చేయాలని పలు ప్రముఖ హోటల్ చైన్&zwnj;లు ప్రతిపాదనలు సమర్పించాయి. &nbsp; టాటా గ్రూప్ (IHCL), లీలా ప్యాలెస్, లెమన్ ట్రీ, మహీంద్రా హాలిడేస్, మారియట్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తి వ్యక్తం చేశాయి. &nbsp;అయితే, ప్రాజెక్టు వాణిజ్య సాధ్యత, పర్యావరణ అనుమతులు, నిర్మాణ ఖర్చులు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలపై కొన్ని సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. &nbsp;ఈ అంశాలపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు పూర్తి స్థాయి లగ్జరీ రిసార్ట్&zwnj;గా మార్చాలని, మరికొన్ని మైస్ &nbsp;అంటే మీటింగ్స్, ఇన్&zwnj;సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ &nbsp;హబ్&zwnj;గా అభివృద్ధి చేయాలని సూచిస్తున్నాయి.</p> <p><strong>వైసీపీ హయాలో రూ.450 కోట్లతో నిర్మాణం&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>&nbsp;వైఎస్ఆర్&zwnj;సీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండపై సుమారు రూ.450 కోట్లతో ఈ భవనాలు నిర్మించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో నిర్మాణం జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు, ధన దుర్వినియోగం ఆరోపణలతో వివాదాస్పదమయ్యాయి. &nbsp;2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ భవనాల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి ఆగస్టు 2025లో మంత్రుల బృందం &nbsp;ను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 2025లో ప్రజల నుంచి, సంస్థల నుంచి సూచనలు కోరగా పలు ప్రతిపాదనలు వచ్చాయి. అందులో అంతర్జాతీయ కాన్సులేట్&zwnj;లు, పర్యాటక హబ్, వెడ్డింగ్ డెస్టినేషన్ వంటి &nbsp;ఐడియాలు ఇచ్చారు. &nbsp;ప్రస్తుతం భవనాలు ఏపీ టూరిజం డెవలప్&zwnj;మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆధీనంలో ఉన్నాయి. వీటి కోసం భారీగా ఖర్చు పెట్టినందున &nbsp;దానికి తగ్గ ఆదాయం వచ్చేలా చూడాలని .. టూరిజంకు ఆర్థిక లాభం ఉండాలని మంత్రుల బృందం ప్రయత్నిస్తోంది.&nbsp;&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/lifestyle/why-is-the-surf-excel-detergent-for-front-load-and-top-load-washing-machines-different-230913" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article