Ropeway From Sonprayag To Kedarnath: రూ. 4081 కోట్లతో అదానీ రోప్‌వే ప్రాజెక్ట్.. సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్నాథ్‌కు 36 నిమిషాల్లో చేరుకోవచ్చు

2 months ago 3
ARTICLE AD
<p>Ropeway From Sonprayag To Kedarnath | అదానీ ఎంటర్&zwnj;ప్రైజెస్ లిమిటెడ్ (AEL), అదానీ గ్రూప్ లోని ప్రధాన సంస్థ కీలకమైన కాంట్రాక్ట్ దక్కించుకుంది. అత్యంత పవిత్ర యాత్రా స్థలాలలో ఒకటైన కేదర్&zwnj;నాథ్&zwnj;కు వెళ్లేందుకు వీలుగా సోన్&zwnj;ప్రయాగ్ నుండి కేదర్&zwnj;నాథ్&zwnj;ను కలిపే రోప్&zwnj;వే నిర్మాణ, నిర్వహణ కాంట్రాక్ట్ పొందింది. కంపెనీ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ఫూర్తయితే భక్తులు కేదార్&zwnj;నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రానికి రోప్&zwnj;వేలో కేబుల్స్ ద్వారా చేరుకోవచ్చు.</p> <h4><strong>ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్</strong></h4> <p>రూ. 4,081 కోట్ల విలువైన రోప్&zwnj;వే ఈ ప్రాజెక్ట్ లో AEL ప్రవేశానికి నాంది పలుకుతుంది. 12.9 కిలోమీటర్ల మేర చేసే ఈ రోప్&zwnj;వే ప్రాజెక్టు రుద్రప్రయాగ్ జిల్లాలోని సోన్&zwnj;ప్రయాగ్, కేదార్&zwnj;నాథ్ మధ్య ప్రయాణ సమయాన్ని 8, 9 గంటల కష్టతరమైన నడకను కేవలం 36 నిమిషాలకు తగ్గిస్తుంది. కేదార్&zwnj;నాథ్ క్షేత్రాన్ని ఏడాదిలో 6 నెలలు మాత్రమే దర్శించుకునే వీలుంటుంది. రోప్&zwnj;వే పూర్తయిన తర్వాత ఇది గంటకు 1,800 మంది ప్రయాణికులను 2 వైపులా తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతి ఏడాది కేదార్&zwnj;నాథ్&zwnj;ను సందర్శించే యాత్రికులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని అదానీ కంపెనీ వెల్లడించింది.</p> <p>ఈ రోప్&zwnj;వే ప్రాజెక్టు ప్రభుత్వ నేషనల్ రోప్&zwnj;వేస్ డెవలప్&zwnj;మెంట్ ప్రోగ్రామ్ &ndash; పర్వతమాల యోజనలో ఓ భాగం. ఇది AEL రోడ్లు, మెట్రో, రైల్, వాటర్ (RMRW) విభాగం ద్వారా అమలు చేస్తుంది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్&zwnj;మెంట్ లిమిటెడ్ (NHLML)తో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్&zwnj;నర్&zwnj;షిప్ (PPP) ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.&nbsp;</p> <h4><strong>సమయం, పరిధి</strong></h4> <p>నిర్మాణం పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టవచ్చు, ఆ తర్వాత అదానీ కంపెనీ AEL 29 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్&zwnj;ను నిర్వహిస్తుంది. ఈ రోప్&zwnj;వే కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మరియు ఉత్తరాఖండ్&zwnj;లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని, తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని భావిస్తున్నారు.</p> <p>కేదర్&zwnj;నాథ్ ఒక్కటే సంవత్సరానికి దాదాపు 20 లక్షల మంది యాత్రికులను ఆకర్షిస్తుంది, ఇది ఈ ప్రాంతంలో వేగవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణ ఎంపికల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.</p> <h4><strong>అదానీ గ్రూప్ నిబద్ధత</strong></h4> <p>&ldquo;కేదర్&zwnj;నాథ్ రోప్&zwnj;వే ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు &ndash; ఇది భక్తి మరియు ఆధునిక మౌలిక సదుపాయాల మధ్య వారధి,&rdquo; అని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. &ldquo;ఈ పవిత్ర యాత్రను సురక్షితంగా, వేగంగా మరియు మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, మేము లక్షలాది మంది విశ్వాసాన్ని గౌరవిస్తాము, అదే సమయంలో NHLML మరియు ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మా భాగస్వామ్యం ద్వారా ఉత్తరాఖండ్ ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాము. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దేశానికి సేవ చేయడమే కాకుండా, దాని ప్రజలను అభివృద్ధి చేసే మౌలిక సదుపాయాలను నిర్మించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.&rdquo;</p> <p>రోప్&zwnj;వే భవిష్యత్ యాత్రా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్&zwnj;లకు ఒక నమూనాగా పనిచేస్తుందని పరిశ్రమ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల నైపుణ్యాన్ని కలపడం ద్వారా, ఈ ప్రాజెక్ట్ కొండ మరియు మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచాలనే ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా ఉంది.</p>
Read Entire Article