Road Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం - బైక్‌ను లారీ ఢీకొని ముగ్గురు మృతి

11 months ago 8
ARTICLE AD
<p><strong>Severe Road Accident At Medchal Check Post:&nbsp;</strong>మేడ్చల్ చెక్ పోస్ట్ (Medchal Checkpost) వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ ముగ్గురిని బలి తీసుకుంది. ఓ కుటుంబం బైక్&zwnj;పై వెళ్తుండగా లారీ ఢీకొని దంపతులతో సహా కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.</p> <p><strong>Also Read: <a title="Adilabad News: తెల్లవారుజామున ఇళ్లల్లో తనిఖీలు - అటవీ అధికారులపై స్థానికుల రాళ్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత" href="https://telugu.abplive.com/telangana/stone-pelting-on-forest-officials-in-keshavapatnam-in-adilabad-district-193069" target="_blank" rel="noopener">Adilabad News: తెల్లవారుజామున ఇళ్లల్లో తనిఖీలు - అటవీ అధికారులపై స్థానికుల రాళ్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత</a></strong></p>
Read Entire Article