Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి

9 months ago 7
ARTICLE AD
<p><strong>Revanth Fires On Kcr:</strong> &nbsp;కృష్ణా జలాలు ఏపీ తరలించుకుపోతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణపై <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> మండిపడ్డారు. &nbsp;ఆనాడు వైఎస్ కు ఊడిగం చేసి కృష్ణా జలాలు సీమకు తరలించుకుపోయేందుకు సహకరించింది నువ్వు కాదా కెసిఆర్ అని ప్రశ్నించారు. నారాయణపేట &nbsp;&ldquo;ప్రజా పాలన- ప్రగతి బాట&rdquo;బహిరంగ సభలో &nbsp;ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. &nbsp;వైఎస్ కుమారుడు <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి ఆరు గంటల పాటు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీళ్లు &nbsp;తరలించుకు పోతుంటే చూస్తూ ఊరుకుంది నువ్వు కాదా .. ఇది ద్రోహం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. నువ్వు చేసిన పాపం ఇవాళ రాష్ట్రాన్ని వెంటాడుతుంది నిజం కాదా &nbsp;పదేళ్లలో సాగునీటి మంత్రులుగా ఉన్నది హరీష్, కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు. &nbsp;ఈ పాపం మీది కాకపోతే ఇంకెవరిదని &nbsp;ప్రశ్నించారు. &nbsp;నీళ్లు రాయలసీమ తరలించుకుపోతే.. నిధులు కెసిఆర్ కుటుంబం తరలించుకుపోయిందని మండిపడ్డారు.&nbsp;</p> <p>పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు ్ని.. &nbsp;అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. &nbsp;ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని.. &nbsp;పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదని ప్రశఅనించారు. &nbsp;పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను కెసిఆర్ ఎందుకు పూర్తి చేయలేదన్నారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పడావుపెట్టి కెసీఆర్ పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చారు .. మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు అనుమతి తెస్తే నా పై కోపంతో దాన్ని పడావు పెట్టారన్నారు. &nbsp;పాలమూరు వలసలు ఆపేందుకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నమేం ప్రయత్నిస్తుంటే&hellip;మమ్మల్ని అడ్డుకుంటున్నారని &nbsp;విమర్శించారు.&nbsp;</p> <p>బీజేపీ, బీఆరెస్ కు నేను సూటిగా సవాల్ విసురుతున్నా .. పన్నెండేళ్ల మోదీ పాలనపై, పదేళ్ల బీఆరెస్ పాలనపై, పన్నెండు నెలల మా పాలనపై చర్చకు మేం సిద్ధమని సవాల్ చేశారు. &nbsp;<a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి&hellip; బీఆరెస్ నుంచి కెసిఆర్ వస్తారో కొడుకును, అల్లుడిని పంపిస్తారో రండి.. ప్లేస్, డేట్ చెప్పండి చర్చకు నేను సిద్ధమన్నారు. గట్టిగా కొడతానని <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a> అంటున్నారు.. అదేమైనా ఫుల్లా.. హాఫా అని ప్రశ్నించారు. కెసిఆర్ నువ్వు గట్టిగా కొట్టాలంటే నీ కొడుకును, నీ బిడ్డను, నీ అల్లుడిని కొట్టుకో .. &nbsp;కాంగ్రెస్ ను కొడతామంటే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.&nbsp;</p> <p>పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తానంటే నిన్ను ఎవరైనా వద్దన్నారా ... పన్నెండు నెలల్లో మేం ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారన్నారు. &nbsp;మేం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువకులకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం .. మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాలలు అప్పగించి వారిని ప్రోత్సహిస్తున్నాం ..ఆర్టీసీలో మహిళకు 600 బస్సులను అప్పగించి వారిని ఓనర్లను చేశామన్నారు. &nbsp;రూ.5వేల కోట్లతో కొడంగల్, వెయ్యి కోట్లతో నారాయణపేట అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని.. &nbsp;ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. &nbsp;బీఆర్ఎస్ కు సూటిగా సవాల్ విసురుతున్నా &nbsp;ఏ ఊర్లో మేం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామో ఆ ఊర్లో మేం పోటీ చేస్తాం ..ఏ ఊర్లో మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో అక్కడే మీరు పోటీచేయాలన్నారు. &nbsp;</p> <p>దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ కులగణన నిర్వహించామని.. ముప్ఫై ఏళ్లుగా పరిష్కారం కానీ ఎస్సీ ఉపకులాల సమస్యకు పరిష్కారం చూపామన్నారు. &nbsp;ఇవన్నీ కెసిఆర్ కళ్లకు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. &nbsp;నల్లడబ్బు పేదల ఖాతాలో వేస్తామన్న మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. &nbsp;రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని వారిని మోసం చేశారని.. &nbsp;2022 లోగా ప్రతీ పేదవాడికి ఇళ్లు ఇస్తామన్నారు&hellip; ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. &nbsp;కిషన్ రెడ్డి, <a title="బండి సంజయ్" href="https://telugu.abplive.com/topic/Bandi-Sanjay" data-type="interlinkingkeywords">బండి సంజయ్</a> కి తప్ప తెలంగాణలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు?<br />రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేసినా తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ కాకుల్లా పొడుస్తున్నారని మండిపడ్డారు. వీళ్లకు సరైన జవాబు చెప్పే బాధ్యత <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> కార్యకర్తలదేనన్నారు. &nbsp;</p> <p>పాలమూరు పచ్చగా కనబడితే వాళ్ల కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని.. &nbsp;మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్లు కండల్లో నిప్పులు పోసుకుంటున్నారు వాళ్ళ కడుపులు మండుతున్నాయ్ .. మీరు బాధపడొద్దు కన్నీరు పెట్టుకోవద్దు ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి పాలమూరును అభివృద్ధి చేసుకుందామన్నారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని బయలుదేరి మనపై కుట్రలు చేస్తున్నారని.. &nbsp;వారికి మీరు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.&nbsp;</p>
Read Entire Article