Reasons for India Lost: రెండో వన్డేలో భారత్ ఓటమికి 3 ప్రధాన కారణాలు.. కెప్టెన్ గిల్ తప్పిదాన్ని గమనించారా!

3 months ago 6
ARTICLE AD
<p style="text-align: justify;">India vs New Zealand 2nd ODI | రాజ్&zwnj;కోట్: న్యూజిలాండ్&zwnj;తో జరిగిన రెండో వన్డే మ్యాచ్&zwnj;లో ఆతిథ్య జట్టు భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్&zwnj;లో సెంచరీ (112 పరుగులు నాటౌట్) సాధించినా ప్రయోజనం లేకపోయింది. ఛేజింగ్ లో విల్ యంగ్, డారిల్ మిచెల్ అజేయ సెంచరీతో భారత్&zwnj;కు ఓటమి తప్పలేదు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఈ సాధారణ లక్ష్యాన్ని భారత బౌలర్లు ఏ దశలోనూ కాపాడుకోలేకపోయారు. రాజ్&zwnj;కోట్&zwnj;లో ఇండియా ఓడిపోవడానికి గల 3 ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి.</p> <h4 style="text-align: justify;">బ్యాటింగ్ ఫ్లాప్ షో</h4> <p style="text-align: justify;">ఇండియా ఓటమికి ప్రధాన కారణం పేలవమైన బ్యాటింగే. వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసిన తర్వాత, భారత జట్టు 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 48 పరుగుల వ్యవధిలో భారత్ 4 వికెట్లు కోల్పోవడం ద్వారా న్యూజిలాండ్&zwnj;కు మ్యాచ్&zwnj;లో కం బ్యాక్ చేసే అవకాశం లభించింది. శుభ్&zwnj;మన్ గిల్ హాఫ్ సెంచరీతో మరోసారి మంచి ప్రారంభం దక్కినా, దానిని సెంచరీగా మార్చలేకపోయాడు. <a title="విరాట్ కోహ్లీ" href="https://www.abplive.com/topic/virat-kohli" data-type="interlinkingkeywords">విరాట్ కోహ్లీ</a> , రోహిత్ శర్మ ఈ మ్యాచులో రాణించలేదు. పేలవమైన బ్యాటింగ్ కారణంగా ఒక సమయంలో భారత్ 250 పరుగులు చేయడం కూడా కష్టం అనిపించింది. కేఎల్ రాహుల్ అజేయ సెంచరీ సాధించడంతో జట్టు 284 స్కోరుకు చేరుకుంది.</p> <h4 style="text-align: justify;">కెప్టెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం</h4> <p style="text-align: justify;">న్యూజిలాండ్ జట్టు కేవలం 46 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ హెన్రీ నికోల్స్ వికెట్ తీశాడు. ఆ తర్వాతి ఓవర్లో కెప్టెన్ శుబ్&zwnj;మన్ గిల్ వికెట్ తీసే అవకాశాన్ని అంటే మహ్మద్ సిరాజ్ లేదా హర్షిత్ రాణాను రంగంలోకి దింపి ఉంటే కివిస్ జట్టుపై ఒత్తిడి పెరిగేది. కానీ అంతగా అనుభవం లేని నితీష్ రెడ్డితో బౌలింగ్ చేయించారు. ఇది డారిల్ మిచెల్, విల్ యంగ్&zwnj;లకు క్రీజులో నిలదొక్కుకోవడానికి హెల్ప్ చేసింది. గత ఓవర్లో వికెట్ పడినప్పుడు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడతాడు, కానీ 14వ ఓవర్లో డారిల్ మిచెల్, విల్ యంగ్ నితీష్ రెడ్డి బౌలింగ్&zwnj;లో స్వేచ్ఛగా షాట్లు ఆడారు.</p> <h4 style="text-align: justify;">స్పిన్నర్లు దెబ్బ తీశారు</h4> <p style="text-align: justify;">భారత స్పిన్నర్లు ఈ మ్యాచ్&zwnj;లో మూల్యం చెల్లించుకున్నారు. భారతదేశంలో స్పిన్నర్లు ప్రభావం చూపేవారు. కానీ ఇటీవల జరుగుతున్న టెస్ట్, వన్డే సిరీస్ లు గమనిస్తే ప్రత్యర్థి జట్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంపై సిద్ధమై వస్తున్నారు. అందుకే భారత్ వన్డే ,టెస్ట్ సిరీస్ లను కొన్ని జట్లకు దశాబ్దాల తరువాత కోల్పోయింది. ఈ వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మొదట నుంచి చివరి ఓవర్ వరకు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. మరో ఎండ్&zwnj;లో రవీంద్ర జడేజాను సైతం స్వేచ్ఛగా ఆడారు. జడ్డూ అనుభవం కూడా పనికిరాలేదు. జడేజా 8 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాడు. పేసర్ల కనీసం లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కివీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. వాషింగ్టన్ సుందర్ గాయంతో నితీష్ రెడ్డికి చాన్స్ వచ్చింది. కానీ అనుభవలేమితో ప్రభావం చూపలేకపోయాడు.</p> <p style="text-align: justify;">&nbsp;</p>
Read Entire Article