Rana Daggubati : మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్టులో రణ్‌వీర్ సింగ్​ను రీప్లేస్ చేసిన రానా... ఏ మూవీనో తెలుసా ?

10 months ago 7
ARTICLE AD
<p><strong>Prashanth Varmas Brahmarakshas :</strong> 'హనుమాన్' సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సంచలనం సృష్టించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ మంచి డిమాండ్ ఉన్న పాన్ ఇండియా డైరెక్టర్ గా మారారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ గురించి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన ప్రాజెక్టులపై పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు. బాలీవుడ్ స్టార్ రణ్&zwnj;వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ కాంబోలో మొదలుపెట్టిన 'బ్రహ్మ రాక్షస' మూవీ మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో అంటూ రోజుకో స్టార్ పేరు వినిపిస్తోంది. తాజా సమాచారం ఈ మూవీలో ప్రకారం స్టార్ హీరో రానా దగ్గుబాటి రణ్&zwnj;వీర్ సింగ్ ప్లేస్ ను రీప్లేస్ చేసినట్టు తెలుస్తోంది.</p> <p><strong>రణవీర్ సింగ్ స్థానంలో రానా దగ్గుబాటి</strong></p> <p>'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన తరువతా' ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'లో దర్శకుడు ప్రశాంత్ వర్మ పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ వర్మ 'బ్రహ్మ రాక్షస' అనే పేరుతో బాలీవుడ్ హీరో రణ్&zwnj;వీర్ సింగ్ హీరోగా ఓ మూవీని ప్రకటించాడు. ఈ సినిమా మొదలవుతుంది అనుకునే లోపే ఆగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ వర్మ పలువురు ప్లాన్ ఇండియా స్టార్లను కలుస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ప్రభాస్ పేరు వినిపించింది. ప్రభాస్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, 2027 లో ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉందని పుకార్లు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం 'బ్రహ్మ రాక్షస' సినిమాలో ప్రభాస్ కాదు రానా దగ్గుబాటి లీడ్ రోల్ పోషిస్తారని అంటున్నారు.</p> <p>ప్రభాస్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో, ప్రశాంత్ వర్మ రానాతో ఈ సినిమా చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రశాంత్ వర్మ రానాను సంప్రదించి, స్క్రిప్టును వినిపించాడని టాక్ నడుస్తోంది. ఇక టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో హీరో రోల్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుంది. మరి రానా ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అనేది తెలియాలంటే ప్రశాంత్ వర్మ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.</p> <p><strong>ఆ రెండు సినిమాలు ఆలస్యం&nbsp;</strong></p> <p>కాగా ఇప్పటికే ప్రశాంత్ వర్మ చేతిలో 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్', మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ టైం పట్టే అవకాశం ఉండడంతో... ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తన దృష్టిని 'బ్రహ్మ రాక్షస' మూవీపై పెట్టాడని అంటున్నారు. మరోవైపు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జై హనుమాన్'ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి లీడ్ రోల్ పోషించబోతున్నారు. ఇప్పటికే 'హనుమాన్'గా రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. 'కాంతారా' మూవీతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న రిషబ్ రాకతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినీమాటిక్స్ యూనివర్స్ నుంచి ఏ మూవీ ఫస్ట్ రిలీజ్ కాబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/cinema/global-star-ram-charan-career-best-films-list-from-chirutha-to-game-changer-193110" width="631" height="381" scrolling="no"></iframe></p> <p>Also Read<strong>:&nbsp;<a title="టాలీవుడ్ తాట తీస్తున్న ఐటీ రైడ్స్... అసలు టార్గెట్ దిల్ రాజు కాదా?" href="https://telugu.abplive.com/entertainment/cinema/income-tax-raids-on-tollywood-dil-raju-mythri-movie-makers-naveen-yerneni-y-ravi-shankar-sukumar-who-is-main-target-195046" target="_blank" rel="noopener">టాలీవుడ్ తాట తీస్తున్న ఐటీ రైడ్స్... అసలు టార్గెట్ దిల్ రాజు కాదా?</a></strong></p>
Read Entire Article