Ram Mohan Naidu News: టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు- వారికి గుడ్‌బై చెప్పేస్తారా!

10 months ago 7
ARTICLE AD
<p><strong>TDP News:</strong> పొలిట్&zwnj; బ్యూరోలో పని చేసే అదృష్టం కింజరాపు కుటుంబానికి మరోసారి వరించనుంది. అప్పట్లో దివంగత నేత ఎర్రన్నాయుడు పొలిట్యూరో సభ్యుడిగా పని చేశారు. ఇప్పుడు రామ్మోహన్నాయుడికి &nbsp;ఈ అవకాశం దగ్గనుంది. ఈ విషయంలో టీడీపీ యువనేత లోకేష్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. వాస్తవానికి టీడీపీ పొలిట్&zwnj; బ్యూరో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. పాత తరానికి విశ్రాంతినిచ్చి, కేవలం వారియర్స్&zwnj;ను మాత్రమే తీసుకోవాలని యువనేత భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా తన సొంత టీంను సిద్ధం చేసుకుంటున్నారు. భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా ప్రతిపక్షంపై ఒంటికాలిపై లేచే నేతలకు ఆ స్థాయిలో గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం నుంచి రామ్మోహన్&zwnj;కు అవకాశం ఇవ్వనున్నారు. తెలుగుదేశం పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీలోకి సిక్కోలు చిన్నోడు ఎంట్రీ దాదాపు ఖరారైంది..</p> <p><strong>ఏమిటీ పొలిట్&zwnj; బ్యూరో</strong><br />తెలుగుదేశం పార్టీలో పొలిట్&zwnj; బ్యూరో అంటే అత్యున్నత క్రియాశీలక రాజకీయ కమిటీ. అత్యున్నత నిర్ణాయక శక్తిగాను భావిస్తారు. ఇందులో 22 మంది సభ్యులు ఉంటారు. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్న పొలిట్&zwnj; బ్యూరోలో చర్చించిన తరువాతే ఓ అభిప్రాయానికి వస్తారు. వాస్తవానికి అంతిమ నిర్ణయం చంద్రబాబుదే అయినా.. అందరి అభిప్రాయాలూ తీసుకోవటం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది.&nbsp;</p> <p>టీడీపీ ఆవిర్భావం నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. ఈ పదవుల్లో ఉన్నవారికి పార్టీలో ఎంతో పలుకుబడి ఉంటుంది. ఇక పార్టీ అధికారంలో ఉండే సమయంలో పొలిట్ బ్యూరో సభ్యులకు ఎంతో విలువ ఉంటుంది. ప్రస్తుతం 164 మంది సభ్యులతో ప్రభుత్వాన్ని నడుపుతున్న <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a>కి సొంతంగా 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో కొంతమంది పొలిట్ బ్యూరో సభ్యులు ఉండగా, వారి బంధువులు, వారసులు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇక 22 మంది పొలిట్ బ్యూరో సభ్యుల్లో ఎక్కువ మంది చంద్రబాబు సహచరులు. దాదాపు 80 శాతం మంది 70 ఏళ్లు పైబడిన వారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు రిటైరయ్యే అవకాశం ఉన్నందున వీరి స్థానంలో ఇప్పుడే కొత్తవారిని పొలిట్ బ్యూరోలోకి తీసుకోవాలన్న ప్రతిపాదన పార్టీ పరిశీలిస్తోందని తెలుస్తోంది.</p> <p><strong>అంతా లోకేష్&zwnj;</strong><br />వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బాధ్యతలను యువనేత లోకేశ్&zwnj;కు పూర్తి స్థాయిలో అప్పజెప్పాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వంలో లోకేశ్ ప్రాధాన్యం పెంచాలని, ఆయనకు ఉప ముఖ్యమంత్రి హెూదా ఇవ్వాలని కూడా కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో తన జట్టుకు కీలక బాధ్యతలు అప్పగించేలా లోకేశ్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ ఆలోచనతోనే పొలిట్ బ్యూరోలోకి యువరక్తం ఎక్కించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో ఉన్న వారిలో శ్రీనివాసులురెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర వంటి కొద్ది వారిని మాత్రమే కొనసాగించాలని అనుకుంటున్నారని సమాచారం. ఇక కొత్తగా పొలిట్ బ్యూరోలోకి వచ్చేవారిలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లాశ్రీనివాసరావు, చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ్, టీజీ భరత్, విశాఖ ఎంపీభరత్, యనమల దివ్య, మంత్రి సవిత, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారి పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో లోకేశ్ ముద్ర స్పష్టంగా ఉండాలంటే ప్రత్యర్థులతో రాజీపడకుండా ఫైట్ చేసే నాయకులు కావాలని భావిస్తున్నారు. అందుకే తనకు బాగా సన్నిహితమైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.</p> <p><strong>రెండేళ్లకోసారి</strong><br />పార్టీలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే పొలిట్ బ్యూరో నియామకాల్లో 30 శాతం మంది కొత్తవారికి, యువనాయకత్వానికి అవకాశమివ్వాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెూదాలో <a title="నారా లోకేశ్" href="https://telugu.abplive.com/topic/Nara-Lokesh" data-type="interlinkingkeywords">నారా లోకేశ్</a> ప్రతిపాదిస్తున్నారు. పార్టీ భావినేత లోకేశ్ నోటి నుంచి ఈ మాట వచ్చిన నుంచి పొలిట్ బ్యూరోలో చంద్రబాబు సహచరులకు బైబై చెప్పడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, వర్ల రామయ్య, కిమిడి కళావెంకటరావు, నక్కా ఆనందబాబు, బాలకృష్ణ, ఎండీ షరీఫ్, ఎన్ఎండీ ఫరూక్, పితాని సత్యనారాయణరావు ఉన్నారు. వీరంతా సీనియర్లు. వీరి వయసు దాదాపు 70 ఏళ్లు పైమాటే. ఇక వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, గుమ్మడి సంధ్యారాణి మాత్రమే 50 ఏళ్లకు అటు ఇటుగా ఉన్నారు. దీంతో త్వరలో జరిగే పొలిట్ బ్యూరో నియామకాల్లో దాదాపు 14 మందికి బైబై చెప్పనున్నారు.&nbsp;</p> <p>అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ పొలిట్&zwnj; బ్యూరోలో కొనసాగుతున్నా రు. అయితే వీరిని ఈసారి కొనసాగిస్తారా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక కేఈ కృష్ణమూర్తి వయసు మీరడంతో రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. సోమిరెడ్డి, వర్ల రామయ్య, ఫరూక్, షరీఫ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు వంటి వారు వయోభారంతో సతమతమవుతున్నారు. దీంతో వీరి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు</p> <p><strong>Also Read: <a title="ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే" href="https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-chief-minister-chandrababu-naidu-team-visit-to-davos-wef-full-schedule-here-194628" target="_blank" rel="noopener">ఆదివారం దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు- WEFలో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సమావేశాలు, షెడ్యూల్ ఇదే</a></strong></p>
Read Entire Article